Veeraiah Chowdary Murder Case : టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యకేసులో కీలక పరిణామం..నిందితులు ఎవరంటే...

ప్రకాశం జిల్లాలో టీడీపీ నేత, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి  హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఐదుగురు దుండగులు ఆయనను హత్య చేసి పారిపోయారు. ఈ కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించారు. వీరయ్య హత్య జరిగిన సమయంలో నిందితులు వాడిన స్కూటీని గుర్తించారు.

New Update
Veeraiah Chowdary Murder Case

Veeraiah Chowdary Murder Case

Veeraiah Chowdary Murder Case : ప్రకాశం జిల్లాలో టీడీపీ నేత, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి  హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఐదుగురు దుండగులు ఆయనను హత్య చేసి పారిపోయారు. ఈ కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించారు. వీరయ్య హత్య జరిగిన సమయంలో నిందితులు వాడిన స్కూటీని గుర్తించారు. చీమకుర్తి బైపాస్ రోడ్డులోని ఓ దాబా వద్ద స్కూటీ ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సంతనూతలపాడు , చీమకుర్తి వైపు పరారీ అయినట్లు గుర్తించారు. కాగా పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి, ముప్పా సురేష్ అతని సమీప బంధువు ఆళ్ల సాంబశివరావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో పలు గ్రూపుల్లో వీరయ్యను దూషిస్తూ దేవేంద్రనాథ్‌ చౌదరి పోస్టులు పెట్టినట్లు గుర్తించిన పోలీసులు.

Also Read: Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?'

వీరయ్య హత్య కేసు రోజుకో మలుపు... పూటకో ట్విస్ట్ నెలకొంటుంది.రాజకీయ వైరం, వ్యాపార శతృత్వమే వీరయ్య చౌదరి హత్యకు ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య జరిగిన రోజు అనుమానితులు.. హంతకులు కలిసి ఒక దాబాలో భోజనం చేసినట్లు తెలుస్తోంది. - కాల్ డేటా ఆధారంగా హత్యలో ఎవరెవరికి సంబంధం ఉందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. హంతకుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రకాశం, నెల్లూరు, గుంటూరుజిల్లాలో పోలీసులు గాలిస్తున్నారు. కేసు పురోగతి కోసం జిల్లా ఎస్పీ మరికొన్ని టీం లను ఏర్పాటు చేశారు. వీరయ్య హత్య కేసుకు సంబంధించి ఒక ప్రజాప్రతినిధిని సైతం పోలీసులు విచారించేందుకు సిద్ధమవుతున్నారు.

Also Read: PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన
 
కాగా టీడీపీ నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి ఈ నెల 23న దారుణ హత్యకు గురయ్యారు. ఒంగోలులోని తన కార్యాలయంలో ఉండగా మాస్కులు ధరించి రెండు బైకులపై వచ్చిన ఐదుగురు దుండగులు కత్తులతో దాడి చేశారు. వీరయ్య చౌదరి ఛాతీ, గొంతు, పొట్టపై పదిహేను కత్తి పోట్లు పొడిచారు. అనంతరం పారిపోయారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వీరయ్య చౌదరిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Also Read: Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు