YS Sharmila: కడప నుంచి పోటీకి సిద్ధం.. షర్మిల సంచలన ప్రకటన
హైకమాండ్ ఆదేశిస్తే కడప నుంచి ఎంపీగా పోటీ చేయడానికి తాను సిద్దమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు.
హైకమాండ్ ఆదేశిస్తే కడప నుంచి ఎంపీగా పోటీ చేయడానికి తాను సిద్దమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు.
ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ కు పోలీసులు షాక్ ఇచ్చారు. మహిళా కౌన్సిలర్ వెంకట లక్ష్మీని ఇంటికెళ్లి బెదిరించిన ఇష్యూలో కేసు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
కడప జిల్లాపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో రేపు ఆంధ్రరత్న భవన్లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కడప జిల్లా కాంగ్రెస్ నేతలు హాజరు కానున్నారు. భేటీ అనంతరం కడప లోక్సభ నుంచి షర్మిల పోటీపై క్లారిటీ రానుంది.
AP: జమ్మలమడుగులో వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్న 11 మంది వాలంటీర్లను సస్పెండ్ చేసింది ఎన్నికల కమిషన్. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేపథ్యంలో వారిని విధుల్లో నుంచి తొలిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇటీవల వాలంటీర్లు పార్టీలకు ప్రచారం చేయొద్దని ఈసీ హెచ్చరించిన విషయం తెలిసిందే.
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు ఎన్నికల కోడ్ ఉల్లఘించారు. అనుమతులు లేకుండా ప్రచారం చేయడంతో ప్రొద్దుటూరులో ఎన్నికల అధికారి ఫిర్యాదు చేశారు. 38వ వార్డు వైసీపీ కౌన్సిలర్ రమాదేవి, ఆమె తనయుడు సురేష్, MLA అభ్యర్థిపై కేసు నమోదు చేశారు.
ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మంగళవారం అనుమతి లేకుండా రాచమల్లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో కోడ్ ఉల్లంఘించారని పోలీసులకు ప్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
జై భీమ్ పార్టీలో జాడ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో10 మంది దస్తగిరి కార్యకర్తలు పార్టీలో చేరారు. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి పులివెందుల నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. ఈ క్రమంలోనే తనకు ప్రాణ హాని ఉందని చెప్పుకొచ్చారు.
ఏపీ సీఎం జగన్ ప్రభుత్వంపై ఎమ్మార్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు చేశారు. జగన్ పాలనలో మాదిగలకు సంక్షేమం లేకుండా పోయిందని విమర్శించారు. తన మద్దతు కూటమికే ఉంటుందని, ఈసారి జగన్ ను ఓడించి తగిన బుద్ధి చెబుతామన్నారు.