పాస్టర్ ప్రవీణ్ మృతిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ గాంధీనగర్ లో ఈ రోజు మీడియాతో పాల్ మాట్లాడారు. పాస్టర్ ప్రవీణ్ ది హత్య అనే చెప్పేందుకు తన దగ్గర అనేక ఆధారాలు ఉన్నాయన్నారు. ఇదే విషయాన్ని హై కోర్టులో కూడా తాను చెప్పానన్నారు. ఈ అంశంపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఈ కేసును ఛేదించడంలో విఫలం అయ్యారని ఆరోపించారు. 24 సంవత్సరాలుగా ప్రవీణ్ పగడాలకు మద్యం తాగే అలవాటు లేదన్నారు. చనిపోయి 22 రోజులు గడుస్తున్నా పోస్టుమార్టం రిపోర్ట్ ఎందుకు బయటికి ఇవ్వలేదని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: ఏం తమాషాలా.. గంటాపై టీడీపీ హైకమాండ్ సీరియస్!
ఎస్పీతో చంద్రబాబు ఎందుకు మాట్లాడారు..?
ఈ దుర్మార్గులు ప్రవీణ్ ను తాగుబోతుగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టుమార్టం రిపోర్టు విడుదల చేయకుండా ఇన్వెస్టిగేషన్ ఎందుకు క్లోజ్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఘటనకు ముందు ప్రవీణ్ కు చాలా బెదిరింపులు వచ్చాయన్నారు. బెదిరింపుల గురించి ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు. ఈ కేసుకు సంబంధించి ఎస్పీ తో సీఎం చంద్రబాబు 45 నిమిషాలు ఎందుకు మాట్లాడారు..? అని అనుమానం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Vijayashanthi: పవన్ ఫ్యామిలీ జోలికొస్తే తాటతీస్తా.. రాములమ్మ స్ట్రాంగ్ వార్నింగ్!
రాష్ట్రంలో చర్చిలు ఎన్ని ఉన్నాయో పవన్ కళ్యాణ్ ఎందుకు ఆరా తీశారు..? అని ఫైర్ అయ్యారు. మరో 100 మంది పాస్టర్ లను టార్గెట్ చేసినట్లు తనకు సమాచారం ఉందన్నారు. ఈ విషయాన్ని ట్రాంప్ దృష్టికి తీసుకుని వెళ్లానన్నారు. ఇక్కడ న్యాయం జరగకపోతే FBI వరకూ తీసుకుని వెళ్తానని ప్రకటించారు. ప్రవీణ్ మద్యం తాగి ఉంటే విజయవాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.
(Pastor Praveen | telugu-news | telugu-latest-news )