Magunta Parvathamma : ఏపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

ఒంగోలు మాజీ ఎంపీ, మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి పార్వతమ్మ మృతి చెందారు. అనారోగ్యంతో చెన్నైలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్ను మూశారు.

New Update

Magunta Parvathamma Passed Away : ప్రకాశం జిల్లా ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది ఆయన సోదరుడు, మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి సతీమణి, మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆమె అనారోగ్యంతో చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పార్వతమ్మ మరణం మాగుంట కుటుంబంలో విషాదం నింపిందని ఎంపీ శ్రీనివాసులు రెడ్డి విచారం వ్యక్తం చేశారు. 

పార్మతమ్మ తనకు తల్లితో సమామని.. ఆమె మరణం తీరని లోటన్నారు. ఏప్రిల్‌ నెలలో మాగుంట సుబ్బరామిరెడ్డి, పార్వతమ్మల కుమారుడు మాగుంట విజయ్ రెడ్డి చనిపోయిన విషయం తెలిసిందే. ఐదు నెలల్లోనే పార్వతమ్మ మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. పార్వతమ్మ మరణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఈరోజే ఆమె అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది.

Also Read :  ఓటీటీలోకి నారా రోహిత్ పొలిటికల్ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

#chennai #ongole #tdp
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe