/rtv/media/media_files/2025/04/22/HbfX5eKM5S0vu084tPpS.jpg)
విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ ఇటీవల షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం ఉన్న బలాబలాల దృష్ట్యా ఈ సీటు కూటమికే దక్కే ఛాన్స్ ఉంది. దీంతో కూటమి నుంచి ఈ సీటు కోసం ఎవరు బరిలో ఉంటారు అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. అయితే.. ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో రాజ్యసభ పోటీ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది.
టీడీపీ ఓకే..
అయితే.. బీజేపీకి ఈ సీటును ఇచ్చేందుకు కూటమిలో ప్రధాన పార్టీ అయిన టీడీపీ అంగీకరించినట్లు తెలుస్తోంది. జనసేన సైతం అందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నామలై, మాజీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీలో ఒకరిని ఏపీ నుంచి రాజ్యసభకు పంపించాలన్నది బీజేపీ ప్లాన్ గా తెలుస్తోంది.
telugu-news | telugu breaking news