/rtv/media/media_files/2025/10/24/fire-accident-2025-10-24-08-28-24.jpg)
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి 44పై ప్రయాణిస్తున్న వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో భారీ సంఖ్యలో ప్రయాణికులు సజీవదహనమయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున 3:00 నుండి 3:30 గంటల మధ్య ఈ సంఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 39 మంది ప్రయాణికులు ఉన్నారని చెబుతున్నారు. ఇందులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఇద్దరు డ్రైవర్లతో కలిపి మొత్తం 43 మంది కాగా వారిలో 13 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు. మరో 20 మంది మృతి చెందినట్లుగా అధికారులు గుర్తించారు మిగిలిన 9 మందికి సంబంధించిన ఆచూకీ తెలిసే వరకు ఉత్కంఠ కొనసాగే అవకాశం కనబడుతుంది. బస్సు ముందు భాగంలోకి బైక్ దూసుకెళ్లి ఢీకొట్టడంతో మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
ప్రయాణికులు వివరాలు
అశ్విన్రెడ్డి (36), జి.ధాత్రి(27), కీర్తి(30), పంకజ్(28), యువన్ శంకర్రాజు (22), తరుణ్(27), ఆకాశ్(31), గిరిరావు (48), బున సాయి(33), గణేశ్(30), జయంత్ పుష్వాహా (27), పిల్వామిన్ బేబి (64), కిశోర్ కుమార్ (41) రమేష్(30) అతడి ముగ్గురు కుటుంబ సభ్యులు, అనూష(22), మహ్మద్ ఖైజర్ (51), దీపక్ కుమార్ (24), అన్డోజ్ నవీన్కుమార్ (26), ప్రశాంత్ (32), ఎం.సత్యనారాయణ(28), మేఘనాథ్ (25), వేణు గుండ (33), చరిత్ (21), చందన మంగ (23), సంధ్యారాణి మంగ (43), గ్లోరియా ఎల్లెస శ్యామ్ (28), జయసూర్య(24), హారిక (30), శ్రీహర్ష (24), శివ (24), శ్రీనివాస రెడ్డి (40), సుబ్రహ్మణ్యం (26), కె.అశోక్ (27), ఎం.జి.రామారెడ్డి (50), ఉమాపతి (32), అమృత్ కుమార్ (18), వేణుగోపాల్రెడ్డి (24) ఉన్నారు.
కర్నూలు బస్సు ప్రమాదం నుంచి బయటపడినవారు : సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్ కుమార్, అఖిల్, హారిక, జష్మిత, అకీర, రమేష్, జయసూర్య, సుబ్రహ్మణ్యం, రామిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి.
ఎంతమంది ఎక్కడెక్కడి నుంచి ఎక్కరంటే?
కూకట్ పల్లి నుండి ఆరుగురు
కుత్బుల్లాపూర్ నుండి నలుగురు
ఎస్ఆర్ నగర్ నుండి ముగ్గురు
ఎర్రగడ్డ నుండి ఇద్దరు
మూసా పేట్ నుండి ఇద్దరు
భరత్ నగర్ నుండి ఒక్కరు
వనస్థలిపురం నుండి ఇద్దరు
ప్యారడైజ్ నుండి ఇద్దరు
నాంపల్లి నుండి ఒక్కరు
లకడికపూల్ నుండి ఇద్దరు
ఎల్బీ నగర్ నుండి ఒక్కరు
కల్లూరు మండలం చిన్నటేకూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు.
కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ నం. 08518-277305
కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూమ్ నం. 9121101059
ఘటనా స్థలి వద్ద కంట్రోల్ రూమ్ నం. 9121101061
కర్నూలు పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నం. 9121101075
కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి హెల్ప్ డెస్క్ నంబర్లు: 9494609814, 9052951010
బాధిత కుటుంబాలు పై నంబర్ లకు ఫోన్ చేసి వివరాలకు సంప్రదించవచ్చు.
Follow Us