BREAKING: టీడీపీ శ్రేణుల దాడి.. అంబటి ఇంట్లో రక్తపు మరకలు (VIDEO)

వైసీపీ నేత అంబటి రాంబాబు నివాసంపై TDP శ్రేణులు భారీ దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో అంబటి నివాసం పూర్తిగా ధ్వంసమైంది. ఇంట్లోని టేబుల్‌పై రక్తపు మరకలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.

New Update
rambabu

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. గుంటూరులోని నవభారత్ నగర్‌లో ఉన్న మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు నివాసంపై TDP శ్రేణులు భారీ దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో అంబటి నివాసం పూర్తిగా ధ్వంసమవ్వడమే కాకుండా, తీవ్ర ప్రాణనష్టం వాటిల్లే స్థాయికి ఉద్రిక్తతలు దారితీశాయి. ఇంట్లోని టేబుల్‌పై రక్తపు మరకలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఈ దాడికి కారణమని తెలుస్తోంది. ఆగ్రహంతో ఊగిపోయిన టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో అంబటి ఇంటిని ముట్టడించారు. ఆందోళనకారులు ఇంటి ఆవరణలోకి చొరబడి అక్కడున్న ఖరీదైన ఫర్నీచర్‌ను చిన్నాభిన్నం చేశారు. బయట పార్క్ చేసి ఉన్న కార్ల అద్దాలను రాళ్లతో, కర్రలతో కొట్టి పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ ఘర్షణలో పలువురు వైసీపీ కార్యకర్తలకు, అంబటి అనుచరులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంటి లోపల ఉన్న డైనింగ్ టేబుల్‌పై మరియు గదుల్లో రక్తపు మరకలు ఉండటం ఘటన తీవ్రతకు అద్దం పడుతోంది. దాడి జరిగిన సమయంలో అంబటి అనుచరులు ప్రతిఘటించే ప్రయత్నం చేయడంతో ఇరువర్గాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది.

పోలీసుల మోహరింపు - ఉద్రిక్తత

దాడి సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే పరిస్థితి అదుపు తప్పడంతో అదనపు బలగాలను రంగంలోకి దించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. సోషల్ మీడియాలో ఈ దాడికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగుతోంది. వైసీపీ శ్రేణులు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతిక దాడులకు చోటు లేదని మండిపడుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు