/rtv/media/media_files/2025/06/16/zrWffveHw2fFMRTqZozy.jpg)
ఏపీ సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనలకు తరుచుగా వాడే హెలీకాప్టర్ లో సాంకేతిక సమస్యలు బయటపడ్డాయి. ఈ రోజు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఏపీలో పర్యటిస్తున్నారు. దీంతో ఆయనకు ఇదే హెలీకాప్టర్ ను అధికారులు కేటాయించారు. తిరుపతి నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళ్లేందుకు ఆయనకు అధికారులు ఇదే హెలీకాప్టరును కేటాయించారు. హెలీకాప్టర్ ఎక్కాక బయటపడ్డ సాంకేతిక లోపం భయపటపడడంతో అంతా షాక్ కు గురయ్యారు. ఈ నేపథ్యంలో కృష్ణపట్నం పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు. మరోవైపు వీఐపీలు ప్రయాణించే హెలీకాప్టరులో తరుచూ సాంకేతిక సమస్యలు తలెత్తడంపై అధికారుల అలెర్ట్ అయ్యారు. హెలీకాప్టరులో టెక్నికల్, సెక్యూర్టీ ప్రాబ్లమ్స్ పై నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ చీఫ్ ను డీజీపీ ఆదేశించారు. ఈ హెలీకాప్టరును వినియోగించవచ్చా? లేదా? అన్నది తేల్చాలని స్పష్టం చేశారు.