/rtv/media/media_files/2025/04/05/ReN9Wt8cCJChD3AzDHQA.jpg)
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్కు సీఎం చంద్రబాబు బిగ్ షాక్ ఇచ్చారు. నందిగామ పర్యటనలో కొలికపూడిని చంద్రబాబు పట్టించుకోలేదు. హెలికాప్టర్ దిగిన అనంతరం తనకు స్వాగతం పలకడానికి వచ్చిన ముఖ్యనేతలతో మాట్లాడారు. ఆ సమయంలో కొలికపూడి వైపు చంద్రబాబు సీరియస్ గా చూశారు. పార్టీ నేతలందరికీ షేక్హ్యాండ్ ఇచ్చి పక్కనే ఉన్న కొలికపూడిని పట్టించుకోలేదు. దీంతో కొలికపూడి వెనక్కి వెళ్లి నిలబడ్డారు.
వరుస వివాదాలతో హైకమాండ్ సీరియస్..
ఇటీవల తిరువూరు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై టీడీపీ హైకమాండ్ సీరియస్ గా ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యే కొలికపూడిని క్రమశిక్షణ కమిటీ పిలిచి వార్నింగ్ కూడా ఇచ్చింది. ఆయన ఆయన తీరులో మార్పు కనిపించలేదు. స్థానిక టీడీపీ నేత రమేష్ రెడ్డితో ఆయన ఇటీవల కయ్యానికి దిగారు. రమేశ్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తానంటూ ఏకంగా హైకమాండ్ కే కొలికపూడి అల్టిమేటమ్ ఇవ్వడం సంచలనంగా మారింది.
(KOLIKAPUDI SRINIVAS RAO | telugu-news | telugu breaking news)