/rtv/media/media_files/2025/02/14/tUUSLRZUA8aup2qWGzL2.jpg)
టాలీవుడ్ నటుడు మోహన్బాబు బౌన్సర్లు రెచ్చిపోయారు. తిరుపతిలోని మోహన్బాబు యూనివర్సిటీ ఎదురుగా ఉన్న F5 రెస్టారెంట్ అద్దాలు, ఫర్నీచర్ లను ధ్వంసం చేశారు. ఇంతకు ఏం జరిగిందంటే.. F5 రెస్టారెంట్కు టీ తాగేందుకు యూనివర్సిటీ విద్యార్థులు వెళ్లారు. అయితే తిరిగి వస్తుండగా పొరపాటున టీ సాసర్, కప్పు పగిలిపోయాయి. వాటికి డబ్బులు చెల్లిస్తామని విద్యార్థులు చెప్పిన కూడా F5 రెస్టారెంట్ యాజమాన్యం విద్యార్థులను పట్టుకుని అసభ్యంగా బూతులు తిట్టారు. ఇదే విషయాన్ని విద్యార్థులు కాలేజీ యాజమాన్యానికి కంప్లైంట్ చేశారు. దీంతో వెంటనే F5 రెస్టారెంట్కు చేరుకున్న మోహన్బాబు బౌన్సర్లు రెస్టారెంట్ అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అయితే దీనిపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు మోహన్బాబు బౌన్సర్ల ఆగడాలపై స్థానికులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మోహన్బాబుకు ఊరట
జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుకు సుప్రీంకోర్టు (Supreme Court) లో ఊరట లభించింది. మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 2024 డిసెంబరు 10వ తేదీన జల్ పల్లిలోని తన ఇంటి వద్ద మోహన్ బాబు ఒక మీడియా ప్రతినిధిపై దాడికి దిగారు. ఈ క్రమంలో ఆయనపై కేసు నమోదయింది. ముందుగా ఈ ఘటనలో మోహన్ బాబుపై బీఎన్ఎస్ 118(1) సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తరువాత లీగల్ ఒపీనియన్ తీసుకుని 109 సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేసి హత్యాయత్నం కేసుగా మార్చారు.
అయితే మోహన్ బాబు తనపై నమోదైన ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ముందుగా హైకోర్టును ఆశ్రయించారు. కానీ 2024 డిసెంబరు 23న హైకోర్టు రిజెక్ట్ చేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరగగా.. ముందస్తు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. కాగా గాయపడిన జర్నలిస్టుకు మోహన్ బాబు స్వయంగా ఆసుపత్రికి వెళ్లి క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ కూడా రిలీజ్ చేశారు.