AP: దొంగల బీభత్సం.. సర్పంచ్ చెవి కోసి ఏం చేశారంటే..?

నంద్యాలలోని రాయమాల్పురం గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో నిద్రిస్తున్న సర్పంచ్ పార్వతమ్మపై దాడి చేసి.. ఆమె చెవి కోసి బంగారు కమ్మలు, గొలుసు అపహరించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

AP: దొంగల బీభత్సం.. సర్పంచ్ చెవి కోసి ఏం చేశారంటే..?
New Update

Robberies  In Nandyal : నంద్యాల (Nandyal) లో దొంగలు (Thieves) బీభత్సం సృష్టించారు. రాయమాల్పురం గ్రామంలో ఇంట్లో నిద్రిస్తున్న వృద్దురాలైన సర్పంచ్ ఇంట్లోకి చొరబడి హల్ చల్ చేశారు. సర్పంచ్ పార్వతమ్మపై దాడి చేసిన ముసుగు దొంగలు..ఆమె చెవి కోసి బంగారు కమ్మలు, గొలుసు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Also Read: ఏపీలో మరో భారీ ప్రమాదం..!

ఇంట్లోని సిసి కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియా (Social Media) లో వైరల్ గా మారాయి. ముసుగు దొంగల వీడియో చూసి పట్టణ శివారు ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. సర్పంచ్ ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

#robberies #thieves #nandyal
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి