EC : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో ఇద్దరు డీఎస్పీ(DSP) లపై ఎన్నికల సంఘం(Election Commission) చర్యలు తీసుకుంది. వివాదాస్పద అధికారులను బదిలీ చేస్తూ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. అనంతపురం టౌన్ డీఎస్పీ వీరరాఘవరెడ్డి, రాయచోటి డీఎస్పీ సయ్యద్ మహబూబ్ బాషాలను బదిలీ చేసింది. టీడీపీ(TDP) నేతల ఫిర్యాదుపై విచారణ జరిపిన ఈసీ తాజాగా చర్యలు తీసుకుంది. అనంతపురం టౌన్ లో తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించారని టీడీపీ ఆరోపించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక గత మూడేళ్లుగా అనంతపురం టౌన్ లో వీరరాఘవరెడ్డి తమ నేతలను వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడింది.
పూర్తిగా చదవండి..Andhra Pradesh : ఇద్దరు డీఎస్పీలను బదిలీ చేసిన ఈసీ..
అనంతపురం జిల్లా లోని ఇద్దరు డీఎస్పీల పై ఎలక్షన్ సంఘం చర్యలు చేపట్టింది.అనంతపురం టౌన్ డీఎస్పీ వీరరాఘవరెడ్డి, రాయచోటి డీఎస్పీ సయ్యద్ మహబూబ్ బాషాలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
Translate this News: