Telangana: అందెశ్రీని సన్మానించిన చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి

తెలంగాణ ఉద్యమకారుడు, కవి గాయకుడు అందెశ్రీని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి సన్మానించారు. రాష్ట్ర సచివాలయంలో సీఎస్ శాంతికుమారిని అందెశ్రీ మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా అందెశ్రీకి శాలువ కప్పి సీఎస్ జ్ఞాపికను అందజేశారు.

New Update
Telangana: అందెశ్రీని సన్మానించిన చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి

Ande Sri was Felicitated by CS Shanti Kumari: ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్రం గీత రచయిత అందెశ్రీని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి సన్మానించారు. రాష్ట్ర సచివాలయంలో సీఎస్ శాంతికుమారిని అందెశ్రీ మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా అందెశ్రీకి శాలువ కప్పి సీఎస్ జ్ఞాపికను అందజేశారు. ఈ క్రమంలో కాసేపు అందెశ్రీతో మాట్లాడిన సీఎస్.. అదెశ్రీ ప్రతిభను కొనియాడారు. ఇక అందెశ్రీ రచించిన పలు పుస్తకాలను సీఎస్ శాంతి కుమారికి అందజేశారు. తెలంగాణ ఉద్యమకారుడైన కవి అందెశ్రీ ఉద్యమ సమయంలో రాసిన గీతంలో ప్రభుత్వం కొన్ని మార్పులు చేసి జూన్ 2న జరిగిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర గీతంగా (Telangana State Song) ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

Also Read: ఎల్లుండి మరోసారి ఎన్డీయే కూటమి సమావేశం..

Advertisment
తాజా కథనాలు