Anchor Shyamala : చంపేస్తామని బెదిరిస్తున్నారు, చాలా భయంగా ఉంది.. యాంకర్ శ్యామల ఆవేదన!

యాంకర్ శ్యామల తాజాగా ఓ వీడియోని రిలీజ్ చేసింది. అందులో ఎన్నికల్లో గెలిచిన కూటమికి, పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటూ తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

New Update
Anchor Shyamala : చంపేస్తామని బెదిరిస్తున్నారు, చాలా భయంగా ఉంది.. యాంకర్ శ్యామల ఆవేదన!

Anchor Shyamala : ప్రముఖ యాంకర్ శ్యామల ఇటీవల జరిగిన ఏపీ ఎలక్షన్స్ లో వైసీపీ (YCP) తరపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా వైఎస్ జగన్ ని సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించింది. ఈసారి ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ పార్టీనే గెలుస్తుందని, జగనే (YS Jagan) సీఎం అవుతారని, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఓడిపోతానని కామెంట్స్ చేసింది. కట్ చేస్తే సీన్ అంతా రివర్స్ అయింది.

ఏపీలో కూటమి గెలవడం, పవన్ పిఠాపురం MLA గా భారీ విజయం సాధించడం జరిగిపోయాయి. ఇలాంటి తరుణంలో శ్యామల తాజాగా ఓ వీడియోని రిలీజ్ చేసింది. అందులో ఎన్నికల్లో గెలిచిన కూటమికి, పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటూ తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

Also Read : ఓవర్సీస్ లో ప్రభాస్ క్రేజ్.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ‘కల్కి’ టికెట్స్!

చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి...

" నాకు చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఆ కాల్స్ వాళ్ళ భయంగా కూడా ఉంది. నేను ఎవరినీ కూడా ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు.వ్యక్తిగతంగా ఎవరిని దూషించలేదు. ఎవరి అభిమానం వారిది. నాకు పార్టీ అప్పగించిన పనిని మాత్రమే నిర్వర్తించానను. భవిష్యత్తులోనూ పార్టీ కోసం నా వంతుగా కష్టపడతా. ఉన్నది మాత్రమే చెప్పను. లేనిది చెప్పలేదు. దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా" అని వీడియోలో పేర్కొంది.

Advertisment
తాజా కథనాలు