Anchor Jhansi: అతని మరణం నాకు తీరని లోటు..యాంకర్‌ ఝాన్సీ ఎమోషనల్‌ పోస్ట్‌!

టాలీవుడ్‌ యాంకర్ ఝాన్సీ తన మేనేజర్‌ చనిపోవడంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆయనను తలచుకుంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌ పెట్టారు.

Anchor Jhansi: అతని మరణం నాకు తీరని లోటు..యాంకర్‌ ఝాన్సీ ఎమోషనల్‌ పోస్ట్‌!
New Update

టాలీవుడ్‌ (Tollywood) ఇండస్ట్రీకి పరిచయం అక్కర్లేని పేరు యాంకర్‌ ఝాన్సీ (Anchor Jhansi) . తొలితరం యాంకర్లలో తనదైన ముద్ర వేసుకునన ఆమె యాంకర్‌ గానే కాకంఉడా..నటిగా కూడా ఆమె చాలా సినిమాల్లో నటించారు. ఆమె సినిమా ఇండస్ట్రీకే చెందిన ఓ వ్యక్తిని చేసుకుని పాప పుట్టిన కొన్నాళ్ల తరువాత విడిపోయారు.

publive-image

ఈ క్రమంలో ఝాన్సీ తాజాగా సోషల్‌ మీడియా (Social Media) లో ఓ పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఆ పోస్ట్‌ టాలీవుడ్ లో హాట్‌ టాపిక్‌ గా మారింది. అసలు విషయం ఏంటంటే..ఝాన్సీ వద్ద మేనేజర్‌ గా పని చేసే ఓ వ్యక్తి చిన్న వయసులోనే గుండె నొప్పితో మరణించాడు. దీంతో ఆమె ఎమోషనల్‌ అవుతూ..ఆ విషయం గురించి సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకుంది.

Also read: అమిత్‌ షాకి తృటిలో తప్పిన ప్రమాదం!

'' శ్రీను..సీను బాబు అని నేను ముద్దుగా పిలుచుకునే నా మెయిన్‌ సపోర్ట్‌ సిస్టమ్‌ ఇతను. హెయిర్‌ స్టైలిస్ట్‌ గా నా దగ్గర పని చేయడం మొదలు పెట్టి నా పర్సనల్ సెక్రటరీ స్థాయికి ఎదిగాడు. నా పనిని ఎప్పటికప్పుడు చాలా సమర్థవంతంగా నిర్వహించేవాడు. అతను నా ఉపశమనం, వర్క్‌ బ్యాలెన్స్‌ , తెలివి అలాగే బలం.

అతను చాలా సున్నితమైనవాడు, నిజమైనవాడు, దయగల వాడు, ఎప్పుడూ నవ్విస్తూంటాడు. అతను కేవలం నా స్టాఫ్‌ మాత్రమే కాదు. నాకు సోదరుడు లాంటి వాడు. 35 సంవత్సరాల వయసులో కార్డియాక్‌ అరెస్ట్‌ తో మమ్మల్ని, ఈ లోకాన్ని విడిచి వెళ్లాడు. నేను చాలా బాధలో ఉన్నాను. మాటలు రావడం లేదు. జీవితం ఒక నీటి బుడగ లాంటిది అని అంటూ ఆమె రాసుకొచ్చారు.

ఈ పోస్ట్‌ చూసిన వారంతా కూడా ఎమోషనల్‌ అవుతూ పోస్టులు పెడుతున్నారు. చాలా బాధకరం మంచి వ్యక్తి అంటూ సంతాపం తెలియజేస్తున్నారు.

Also read: దీపావళికి ట్రైన్ లో ఉరెళ్తున్నరా?.. అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి!

#emotional-post #manager #anchor-jhansi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి