Amitabh: ఆస్పత్రిలో చేరిన అమితాబ్.. ఆందోళనలో అభిమానులు!

బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ ముంబైలోని కోకిలాబెన్‌ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. భుజం నొప్పితో బాధపడుతున్న ఆయన యాంజియోప్లాస్టీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. 'నేను ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను' అంటూ బిగ్ బి పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

New Update
Amitabh: ఆస్పత్రిలో చేరిన అమితాబ్.. ఆందోళనలో అభిమానులు!

Amitabh Bachchan Hospitalised: బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం ముంబైలోని కోకిలాబెన్‌ ఆస్పత్రిలో అడ్మిట్ చేసినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించిండినట్లు సమాచారం. అయితే అమితాబ్ కు ఏమైందనే విషయంపై స్పష్టత లేకపోగా.. ఇందుకు సంబంధించిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.

ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను..
ఈ మేరకు అమితాబ్ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా 'నేను ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను' అంటూ రాసి షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అయితే తన అనారోగ్యాన్ని ఉద్దేశించే బిగ్ బీ ఈ పోస్ట్‌ పెట్టాడని, ఆయన త్వరగా కోలుకుని ఇంటికి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరికొన్ని నివేదికల ప్రకారం భుజం సమస్య కారణంగా ఈరోజు ఆస్పత్రిలో చేరాడని, యాంజియోప్లాస్టీ చేయించుకున్నట్లు తెలుస్తుంది. అలాగే కళ్ల సమస్యతో బాధపడుతున్నాడని, వాటి చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా బచ్చన్ ఫ్యామిలీ స్పందిస్తేనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు