Telangana Rains: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ ఆరా తీశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని వివరించిన సీఎం.. వరదల వల్ల వాటిల్లిన నష్టాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు అవసరమైన తక్షణ సాయం చేస్తామని, వరద సహాయక చర్యల్లో సహకారం అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.
పూర్తిగా చదవండి..CM Revanth: సీఎం రేవంత్కు అమిత్షా ఫోన్.. తెలంగాణకు తక్షణ సాయం!
భారీ వర్షాలు, వరదల గురించి సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి అమిత్ షా ఫోన్ చేసి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని సీఎం వివరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన తక్షణ సాయం చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.
Translate this News: