Stanford University : యూనివర్సిటీలో అడ్మిషన్ ఇప్పిస్తామంటూ రూ.3.25 కోట్లు కొట్టేసిన దంపతులు!

అమెరికా స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ ఇప్పిస్తామని రూ.3.23 కోట్లు దోచేసిన హైదరాబాద్‌కు చెందిన పాలడుగు రఘురామ్‌, సునీత దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడు చాట్ల సంజీవ్‌ కుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

New Update
Stanford University : యూనివర్సిటీలో అడ్మిషన్ ఇప్పిస్తామంటూ రూ.3.25 కోట్లు కొట్టేసిన దంపతులు!

Hyderabad : ప్రముఖ యూనివర్సిటీలో అడ్మిషన్ ఇప్పిస్తామంటూ విద్యార్థుల నుంచి భారీగా దోచేసిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు మాదాపూర్‌కి చెందిన బాధితుడు చాట్ల సంజీవ్‌ కుమార్‌ కు అమెరికా (America) లోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ ఇప్పిస్తామంటూ హైదరాబాద్‌ (Hyderabad) కు చెందిన పాలడుగు రఘురామ్‌, సునీత దంపతులు మోసానికి పాల్పడ్డారు. అండర్‌ గ్రాడ్యుయేషన్‌ సీటు కోసం సంజీవ్ దగ్గర రూ.3.25 కోట్లు తీసుకున్నారు (Robbing). అమెరికా వైట్‌ హౌస్‌లో తమకు తెలిసిన వ్యక్తి ఉన్నారని నమ్మించి డబ్బులు ముట్టగానే మొహం చాటేశారు. కొద్దిరోజులకు సంజీవ్ వారిని నిలదీయడంతో మైసూర్‌కు పారిపోయారు. అమెరికాలో ఉన్నట్లుగా మైసూర్‌ నుంచి వాట్సాప్‌ కాల్‌ మాట్లాడటంతో అసలు విషయం బయటపడింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read : మీకు కేంద్ర మంత్రులుగా ఉండే అర్హత లేదు.. బీజేపీ ఎంపీలపై పొన్నం ఫైర్!

Advertisment
తాజా కథనాలు