/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/FotoJet-jpg.webp)
Ambati Rambabu: ఏపీ ప్రభుత్వం ఇటీవల పోలవరం ప్రాజెక్టుపై (Polavaram Project) శ్వేతపత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, అప్పటినుంచి మాజీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు టీడీపీ సర్కార్ పై ఎదురుదాడి చేస్తున్నారు. తాజాగా, సోషల్ మీడియాలో ఆయన ఓ పోస్టు పెట్టారు.
Also Read: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం స్కీంపై అప్డేట్.. ఈ జిల్లా నుంచే ప్రారంభించనున్న టీడీపీ సర్కార్..!
కాఫర్ డ్యామ్ లు లేకుండానే ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్న బాబుకి (Chandrababu Naidu) ప్రాజెక్టు ఇంకా అర్థం కాలేదన్న మాట? అందుకే చెప్పాను... పోలవరం క్లిష్టమైన ప్రాజెక్టు అని.. అర్థం కావడం కష్టం అని! అంటూ అంబటి ట్వీట్ చేశారు. చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ వీడియో క్లిప్పింగ్ ను తన ట్వీట్ కు అంబటి జతచేశారు.
కాఫర్ డ్యాంలు లేకుండానే
ప్రాజెక్ట్ పూర్తి చేయాలని
అనుకున్న బాబు గారికి
ప్రాజెక్టు ఇంకా అర్ధం కాలేదన్నమాట ?అందుకే చెప్పా
పోలవరం క్లిష్టమైన ప్రాజెక్ట్ అని
అర్ధం కావటం కష్టం అని ! pic.twitter.com/4FuIVXwoGF— Ambati Rambabu (@AmbatiRambabu) June 30, 2024