Ambani’s pre-wedding Bash : అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్ బాష్..ఈమధ్యే గుజరాత్ లోని జామ్ నగర్ లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రముఖులు, ఉన్నతస్థాయి వ్యక్తులు హాజరయ్యారు. దీంతో జామ్ నగర్ ప్రముఖుల రాకతో సందడిగా మారింది. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు జామ్ నగర్ ఎయిర్ పోర్టు విమానాలతో కిక్కిరిసిపోయింది. ప్రముఖులు వచ్చిన విమానాలతో రద్దీగా మారింది. దీంతో ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు భారత వైమానిక దళం రంగంలోకి దిగింది. ఐదు రోజులపాటు ఎలాంటి ఘటనలను జరగకుండా భారీ భద్రతా చర్యలు తీసుకుంది. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4వ తేదీ వరకు ఎయిర్ ఫీల్డ్ లో 24గంటల పాటు కార్యకలాపాల కోసం ఐఏఎఫ్ సహాయం కోసం రిలయన్స్ గ్రూప్ డిఫెన్స్ సెక్రటరీకి లేఖ రాసింది. జామ్ నగర్ వైమానిక స్థావరం రౌండ్-ది-క్లాక్ ఆపరేషన్ మోడ్లోకి వెళ్లిందని డిఫెన్స్ సెక్రటరీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ను అభ్యర్థించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అయితే మొదట్లో ఐఏఎఫ్ కు 30 నుంచి 40 మాత్రమే ఎయిర్ క్రాఫ్టులు వస్తాయని లేఖలో పేర్కొన్నారు. కానీ 600లకు పైగా విమానాలు జామ్ నగర్ వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి.
పూర్తిగా చదవండి..Ambani’s pre-wedding Bash : అంబానీ రేంజ్ అట్లుంటుంది మరి..ఏకంగా ఐఏఎఫ్ రంగంలోకి దిగిందిగా..!
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రివెడ్డింగ్ కు గుజరాత్ లోని జామ్ నగర్ ఈ ఈవెంట్ కు వేదికైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. దాదాపు 600లకుపైగా విమానాలతో నిండిపోయిన ఎయిర్ పోర్టులో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ఏకంగా ఐఏఎఫ్ రంగంలోకి దిగింది.
Translate this News: