Breaking News: ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ కు షాక్‌..పార్టీని విడనున్న మరో ఎమ్మెల్యే

ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ కు బిగ్‌ షాక్‌ తగిలింది. అలంపూర్ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అబ్రహం శుక్రవారం పార్టీకి గుడ్‌ బై చెప్పి కాంగ్రెస్‌ చేరనున్నారు.ముందు టికెట్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అబ్రహానికే కేటాయించారు. ..కానీ చివరికి చల్లా విధేయుడు అయిన విజయుడికి ఇచ్చారు.

Breaking News: ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ కు షాక్‌..పార్టీని విడనున్న మరో ఎమ్మెల్యే
New Update

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ప్రధాన పార్టీల్లో రాజకీయ పరిణామాలు తారుమారు అవుతున్నాయి. ఓ వైపు రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ప్రచార హోరుతో మారు మోగుతుంటే..కొందరు నేతలు మాత్రం పార్టీ పెద్దల మీద అసంతృప్తితో బాయ్‌ బాయ్‌ చెబుతున్నారు. తాజాగా అలంపూర్‌ లో బీఆర్‌ఎస్‌ కు పెద్ద షాక్‌ తగిలింది.

అలంపూర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అబ్రహం పార్టీని వీడారు..ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్‌ కండువాను కప్పుకుంటున్నట్లు సమాచారం. ముందు బీఆర్‌ఎస్‌ అలంపూర్‌ టికెట్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అబ్రహానికే కేటాయించారు. ..కానీ చివరికి వచ్చే సరికి చల్లా విధేయుడు అయిన విజయుడికి ఇచ్చారు. దీంతో అబ్రహం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

దీంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయన హస్తం గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. శుక్రవారం నగరంలో రేవంత్‌ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఆయన కేవలం ఆయన సిద్దాంతాలు, తనని నమ్ముకున్న వారి కోసమే పార్టీ మారుతున్నట్లు తెలిపారు.

అయితే అలంపూర్‌ లో బీఆర్‌ఎస్‌ కు షాక్‌ మీద షాక్‌ తగులుతూనే ఉంది. ఇప్పటికే మాజీ ఎంపీ మందా జగన్నాథం కాంగ్రెస్‌ లో చేరగా..తాజాగా అబ్రహం కూడా కాంగ్రెస్‌ గూటికే చేరారు. దీంతో అలంపూర్‌ లో కాంగ్రెస్‌ బలం పెరిగిందనే చెప్పవచ్చు. ఇప్పటికే చాలా కాలం నుంచి ఎస్సీ రిజర్వడ్‌ నియోజకవర్గమైన అలంపూర్ లో అగ్రకూలల పెత్తనం పై సీనియర్‌ నేతలు గుస్సుగా ఉన్నారు.చల్లా పెత్తనాన్ని అడ్డుకునేందుకు అలంపూర్ అగ్రనేతలంతా ఏకతాటిపైకి వస్తున్నారు.

Also read: ఉత్కంఠ పోరులో భారత విజయం: చివరి బంతికి సిక్సర్ బాదిన రింకూ

#sitting-mla #alampur #brs #congress
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe