Akkineni Akhil : ఆ డైరెక్టర్ తో అఖిల్ సినిమా ఫిక్స్ అయిందా?

నాగార్జున తనయుడు అఖిల్‌ కోసం మంచి కథను వెతికి పట్టుకునేందుకు రంగంలోకి దిగినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఇటీవల 'వినరో భాగ్యము విష్ణుకథ' ఫేమ్‌ మురళీ కిశోర్‌ తన కథతో నాగ్‌ను మెప్పించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌పై నాగ్‌ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

New Update
Akkineni Akhil : ఆ డైరెక్టర్ తో అఖిల్ సినిమా ఫిక్స్ అయిందా?

Akkineni Akhil New Movie Update : అక్కినేని అఖిల్ (Akkineni Akhil) హీరోగా నటించిన 'ఏజెంట్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుందో తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా గత ఏడాది ఏప్రిల్ 28 న భారీ అంచనాల నడుమ విడుదలై అఖిల్ కెరియర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. సినిమా వచ్చి ఏడాదికి పైగా కావస్తున్న అఖిల్ ఇప్పటిదాకా తన తదుపరి ప్రాజెక్ట్ ను ప్రకటించనేలేదు. ఆ మధ్య కొత్త దర్శకుడు అనిల్‌ కుమార్‌తో యూవీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలొచ్చాయి.

ప్రస్తుతం అది పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మరోవైపు హీరో నాగార్జున (Nagarjuna) కూడా తన తనయుడు అఖిల్‌ కోసం మంచి కథను వెతికి పట్టుకునేందుకు రంగంలోకి దిగినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఇటీవల 'వినరో భాగ్యము విష్ణుకథ' ఫేమ్‌ మురళీ కిశోర్‌ తన కథతో నాగ్‌ను మెప్పించినట్లు సమాచారం.

Also Read : వాళ్ళతో కలిసి ‘కల్కి’ చూడాలని ఉంది.. అమితాబ్ బచ్చన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఇది చిత్తూరు నేపథ్యంలో సాగే ఓ రూరల్‌ డ్రామా కథగా ఉండనుందని.. అఖిల్‌కు సరిగ్గా సరిపోయేలా ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌పై నాగ్‌ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఆయన దీన్ని తమ సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌ (Annapurna Studios) లో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని అంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు