'నన్ను ఆపే వ్యక్తి ఇంకా పుట్టలేదు'.. సీఐపై కోపంతో ఊగిపోయిన అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం ఎమ్మెల్యే అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ.. సంతోష్ నగర్ సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచారం ముగుస్తోందని సీఐ వారించగా.. తనకే వార్నింగ్ ఇస్తావా? అంటూ రెచ్చిపోయారు. తనను ఆపే వాడు ఇంకా పుట్టలేదంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. By Shiva.K 22 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Akbaruddin Owaisi: సంతోష్ నగర్ సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. ఎన్నికల ప్రచార సమయం ముగిసిపోతుందని సీఐ శివ చంద్ర వారించగా. ఆయనపై కోపంతో ఊగిపోయారు ఓవైసీ. ఇంకా 5 నిమిషాలు సమయం ఉన్నప్పటికీ.. ముందే ఎలా వార్నింగ్ ఇస్తారంటూ ఫైర్ అయ్యారు. తన వద్ద కూడా వాచ్ ఉందని, తనను ఆపే వ్యక్తి ఇంకా ఎవరూ పుట్టలేదని వ్యాఖ్యానించారు. అవసరమైతే తాను ఇంకా మాట్లాడుతానని అన్నారు అక్బరుద్దీన్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చాంద్రాయణగుట్టలో ప్రచారం చేశారు. అయితే, సమయం మించిపోవడంతో.. అక్కడే విధులు నిర్వహిస్తున్న సీఐ శివ చంద్ర ఆయన్ను వారించారు. సమయం ముగిసిపోతుందని, ఇక ప్రచారం ముగించాలని అన్నారు. అయితే, తననే అడ్డుకుంటావా? అంటూ సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు అక్బరుద్దీను. తనను ఎవరూ ఆపలేరని అన్నారు. తాను సైగ చేస్తే పరుగులు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. కత్తి పోట్లు, బుల్లెట్ గాయాలు అయ్యాయని, తన పని అయిపోయిందని అనుకుంటున్నారేమో.. ఇంకా అదే ఆదేవశం.. అదే దమ్ము నాలో ఉందంటూ రెచ్చిపోయారు అక్బరుద్దీన్. 'పరుగులు పెట్టిద్దామా? నేను అలిసిపోయానని అనుకుంటున్నారు.. మన పని అయిపోయిందనుకుంటున్నారు. కానీ, వారికి మనమేంటో చూపించాలి. అక్బరుద్దీన్ ఓవైసీతో పోటీ చేయడానికి వస్తున్నారు. రానీయండి. వాళ్లు గెలుస్తారో.. మనం గెలుస్తామో చూద్దాం' అంటూ ప్రజలనుద్దేశించి ఆవేశంగా ప్రసంగించారు అక్బరుద్దీన్ ఒవైసీ. Also Read: కేసీఆర్కు జై కొట్టిన పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి.. వీడియో వైరల్.. కేటీఆర్, గోరటి వెంకన్న ఇంటర్వ్యూపై కేసు నమోదు.. #telangana-politics #telangana-news #telangana-political-news #telangana-elections-2023 #akbaruddin-owaisi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి