పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రదాడులు.. వైమానిక స్థావరంలోకి చొరబడ్డ ముష్కరులు

పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రదాడులు చోటుచేసుకున్నాయి. పంజాబ్‌ ప్రావిన్సులోని మియన్వాలిలో ఉన్న వైమానిక స్థావరంలోకి పలువురు ముష్కరులు చొరబడి దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులను తిప్పికొట్టిన పాక్ సైన్యం.. ముగ్గురు ఉగ్రవాదుల్ని హతం చేసినట్లు తెలిపింది.

New Update
పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రదాడులు.. వైమానిక స్థావరంలోకి చొరబడ్డ ముష్కరులు

పాకిస్థాన్‌లో వరుసగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. తాజాగా శనివారం ఉదయం పంజాబ్‌ ప్రావిన్స్‌లోని మియన్వాలి ప్రాంతంలో వైమానిక స్థావరంపై ఉగ్రదాడులు జరిగాయి. ఈ దాడులకు తమ బాధ్యతేనని తెహ్రీక్ ఇ జిహాద్‌ ఉగ్రసంస్థ ప్రకటించింది. ఫైటర్ జెట్లు ఉన్న స్థావంరంలోకి పలువురు ఉగ్రవాదులు చొరబడ్డారు. అయితే ఈ దాడులను ప్రతిఘటించిన పాక్ సైన్యం ముగ్గురు ముష్కరుల్ని హతం చేసింది. అలాగే మరో ముగ్గుర్ని నిర్బంధంలోకి తీసుకున్నట్లు తెలిపింది. ఈ దాడులు జరిగే సమయానికి తమ భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమై వారి కుట్రల్ని భగ్నం చేసినట్లు పేర్కొంది.

ఇక ఈ దాడుల్లో మూడు యుద్ధ విమానాలు, ఓ ఇంధన ట్యాంకర్ ధ్వంసమయ్యాయని.. ప్రస్తుతం దీనికి సంబంధించి ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపింది. అయితే భద్రతా సిబ్బందికి సంబంధించి ప్రాణనష్టం గురించి చెప్పలేదు. ఇదిలా ఉండగా.. ఈ దాడికి బాధ్యత వహించిన తేహ్రీక్ ఇ జిహాద్ ఉగ్రవాద సంస్థ ఈ ఏడాది జులైలో కూడా బలోచిస్తాన్‌లోని సైనిక స్థావరంపై దాడులు చేసింది. ఈ ఘటనలో 12 మంది పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

Also Read: భారీ భూకంపం.. 128కి చేరిన మృతుల సంఖ్య

Also read: మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంలో అలా చేయడం కష్టమే: సుప్రీంకోర్టు

Advertisment
తాజా కథనాలు