Movies:ముప్పై ఏళ్ళ తర్వాత మళ్ళీ వస్తున్న కమల్ హాసన్-మణిరత్నం

ఇద్దరు లెజెండ్స్...ముప్పై ఏళ్ళ క్రితం వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇప్పటికీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా నిలుస్తుంది. ఆ సినిమా నాయకుడు అయితే...ఆ లెజెండరీ కాంబినేషన్ కమల్ హాసన్, మణిరత్నం. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరూ కలిసి ఒక మూవీ చేస్తున్నారు. కేహెచ్ 234 గా పిలుస్తున్న ఈ సినిమా షూటింగ్ మొదలైంది.

New Update
Movies:ముప్పై ఏళ్ళ తర్వాత మళ్ళీ వస్తున్న కమల్ హాసన్-మణిరత్నం

కమల్ హాసన్ కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మణిరత్నం మద్రాస్ టాకీస్ సంయుక్తంగా కెహెచ్ 234 సినిమాను నిర్మిస్తున్నాయి. 1987లో నాయకుడు సినిమాకి తొలిసారి కలిసి పనిచేసిన కమల్, మణిరత్నాలు కలిసి మళ్ళీ ఇన్నేళ్ళకు సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు గ్రేట్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. ఈ సినిమాకి ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండగా.. రవి.కె.చంద్రన్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.నవంబర్ 7న కమల్ హాసన్ పుట్టినరోజు నాడు ఈ సినిమాకు సంబంధించి భారీ అప్ డేట్ ని అందిస్తార‌ని మేకర్స్ చెబుతున్నారు.

Also Read:తీవ్ర కష్టాల్లో టీమిండియా మాజీ కోచ్..నిధులు సేకరిస్తున్న స్నేహితులు

ఈ సినిమాలో (కేహెచ్ 234) త్రిష, నయనతార, దుల్కర్ సల్మాన్, జయం రవిలు నటిస్తారని ప్రచారం సాగుతోంది. నవంబర్  7న దీనికి సంబంధించి కూడా అప్డేట్ రావొచ్చని అంటున్నారు. ఈ మూవీ షూటింగ్ మొదలైంది. దీనికి సంబంధించి వీడియో కూడా విడుదల అయింది. దీన్ని పాన్ ఇండియా మూవీగా విడుదల చేయనున్నారట. ఈ సినిమా కోసం భారీగానే నటులను తీసుకోవాలని మణిరత్నం ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే, ఎంపిక చేసిన నటులుకు మణిరత్నం కథను వినిపించారని, వారు కూడా మూవీ చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు