T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్లో భాగంగా ఆదివారం భారత్ తో జరిగిన మ్యాచ్ లో పాక్ ఘోర ఓటమిపాలైంది. దీంతో వరుసగా రెండో మ్యాచ్ లోనూ ఓటమి చవిచూడటంపై పాక్ మాజీలు మాలిక్, షాహిద్ అఫ్రిదిలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ జట్టు ఓటమికి భారత అద్భుతమైన బౌలింగ్తోపాటు పాక్ బ్యాటర్ల తప్పిదాలే కారణమని మాజీ కెప్టెన్ సలీమ్ మాలిక్ అన్నారు. కీలక సమయంలో బ్యాటింగ్కు వచ్చిన వసీమ్ ఇమాద్ 23 బంతులు ఎదుర్కొని కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడని, ఇదే పాక్ జట్టు ఓటమికి ప్రధాన కారణమన్నాడు.
పూర్తిగా చదవండి..Ind vs Pak: పాక్ ఓటమికి అతడే కారణం.. మాలిక్, అఫ్రిదిలు సంచలన వ్యాఖ్యలు!
భారత్ తో గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమిపాలైన పాకిస్థాన్ టీమ్ పై పాక్ మాజీలు మాలిక్, అఫ్రిది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ ఓటమికి వసీమ్ ఇమాద్ కారణమన్నారు. పాక్ డ్రెస్సింగ్ రూమ్లో వాతావరణం బాగోలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Translate this News: