/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-03T153219.364.jpg)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సూర్యుని ఎగువ వాతావరణాన్ని, సూర్యుడి నుండి వెలువడే అయానైజ్డ్ కణాల స్వభావం పరిమాణాన్ని అధ్యయనం చేయడానికి ఆదిత్య ఎల్1 అంతరిక్ష నౌకను గత ఏడాది సెప్టెంబర్ 2న ప్రయోగించింది.
ఇది జనవరి 6న భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజియన్ పాయింట్గా పిలిచే ఎల్1 పాయింట్కి చేరుకుంది. ఆదిత్య ఎల్1 అంతరిక్ష నౌక హాలో ఆర్బిట్లో తొలి కక్ష్యను పూర్తి చేసినట్లు ఇస్రో ప్రకటించింది.
Aditya-L1: Celebration of First Orbit Completion 🌞🛰️
Today, Aditya-L1 completed its first halo orbit around the Sun-Earth L1 point. Inserted on January 6, 2024, it took 178 days, to complete a revolution.Today's station-keeping manoeuvre ensured its seamless transition into… pic.twitter.com/yB6vZQpIvE
— ISRO (@isro) July 2, 2024
వ్యోమనౌక ఈ కక్ష్యను పూర్తి చేయడానికి 178 రోజులు పట్టింది. ఇప్పుడు అంతరిక్ష నౌక రెండవ హాలో కక్ష్యలో విజయవంతంగా తన మార్గాన్ని మార్చుకుంటుందని..సాఫీగా ప్రయాణిస్తోందని ఇస్రో తన X పేజీలో పేర్కొంది.