Faria Abdullah : 'జాతి రత్నాలు 2 అప్పుడే'.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన హీరోయిన్

'ఆ ఒక్కటీ అడక్కు' మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఓ ఇంటర్వ్యూలో 'జాతి రత్నాలు 2' పై అప్డేట్ ఇ చ్చింది

New Update
Faria Abdullah : 'జాతి రత్నాలు 2 అప్పుడే'.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన హీరోయిన్

Jathi Rathnalu 2 Update :  టాలీవుడ్(Tollywood) అప్ కమింగ్ యంగ్ హీరోయిన్స్ లో ఫరియా అబ్దుల్లా(Faria Abdullah) ఒకరు. 'జాతి రత్నాలు' సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే యూత్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. సినిమాలో ఆమె పోషించిన చిట్టి పాత్ర ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. దాంతో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిన ఫారియా 'జాతి రత్నాలు(Jathi Ratnalu) తర్వాత ఇప్పుడు మరోసారి అలాంటి రోల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

publive-image

అల్లరి నరేష్(Allari Naresh) సరసన ఫరియా అబ్దుల్లా నటిస్తున్న తాజా చిత్రం 'ఆ ఒక్కటీ అడక్కు'. మల్లి అంకం దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 3 న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫరియా అబ్దుల్లా 'జాతి రత్నాలు 2' పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది.

publive-image

'కల్కి' రిలీజ్ తర్వాత 'జాతి రత్నాలు 2'

తాజా ఇంటర్వ్యూ లో హీరోయిన్ ఫారియా అబ్దుల్లా 'జాతి రత్నాలు 2' గురించి మాట్లాడుతూ.. " జాతిరత్నాలు నిర్మాతలు ప్రస్తుతం కల్కి సినిమాతో బిజీగా ఉన్నారు. అది చాలా పెద్ద ప్రాజెక్ట్. కల్కి రిలీజ్ కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. కల్కి రిలీజ్ తర్వాత 'జాతి రత్నాలు 2' కోసం ఆలోచిస్తారేమో అని అనుకుంటున్నా" అని చెప్పింది. అంతే కాకుండా ప్రెజెంట్ 'మత్తు వదలరా' సీక్వెల్ తో పాటూ ఓ తమిళ్ సినిమా చేస్తున్నట్లు తెలిపింది. దీంతో ఫరియా అబ్దుల్లా చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

publive-image

Also Read : ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలే.. కల్కి రిలీజ్ డేట్ వచ్చేసింది..!

Advertisment
తాజా కథనాలు