/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-3-16.jpg)
Actress Anasuya Bharadwaj : నటి అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ముఖ్యంగా ఆమె ట్వీట్లు నెట్టింట ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి. ఆమె ధైర్యమైన వ్యక్తిత్వం, వివాదాస్పద అంశాలపై స్పందనలు ఆమెను ఎప్పుడూ వార్తల్లో నిలుపుతాయి. తాజాగా ఓ పోస్ట్తో అనసూయ మరోసారి నెట్టింట చర్చనీయాంశమయ్యారు. అనసూయ తన ట్విట్టర్ లో.. " మరీ ఇంత చేతకానివాళ్లలా ఉంటే ఎలా? మీకు దమ్ముంటే నాపై కాదు తరచూ నేను ఏం చేసినా ఆ టాపిక్ లాగేవారిని అనండి...
కానీ మీరు అలా చేయరు కదా. ఎందుకంటే మీకు అది చేతకాదు. మీ హీరోలా ఆడవారిని ఉద్దేశించి దుర్భాషలాడడం మాత్రమే వచ్చు కదా పాపం. మీరంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా" అంటూ రాసుకొచ్చింది. అనసూయ ఈ ట్వీట్ ను ఏ సందర్భంలో చేశారు, ఎవరిని ఉద్దేశించి చేశారు అనేది స్పష్టంగా తెలియదు. అయితే, సాధారణంగా ఇలాంటి వ్యాఖ్యలు ఒకరి పనితీరు, నైపుణ్యాలు, లేదా వ్యక్తిత్వంపై విమర్శగా భావించబడతాయి.
😄 Maree inta chaatakaanivaalla laaga unte elagandi.. nijanga meeku kaaltundante naa meeda kaadu.. astamaanam nenu em pani chesina aa topic laage vaallani anandi dammunte.. kaani meeru ala cheyaru kada.. endukante meeku adi chaatakaadu.. mee hero laaga aadavaallani uddesinchi…
— Anasuya Bharadwaj (@anusuyakhasba) July 24, 2024
Also Read : విజయ్ ‘గోట్’ లో పాట పాడిన కోలీవుడ్ స్టార్ హీరోయిన్.. సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?
అనసూయ ఈ ట్వీట్ ద్వారా ఒక వర్గాన్ని లేదా వ్యక్తిని అవమానించాలని అనుకున్నారా? లేదా తన అభిప్రాయాన్ని బలంగా వ్యక్తపరచాలని అనుకున్నారా? అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. కొంతమంది ఆమెను బహిరంగంగా విమర్శిస్తూ, ఆమె వ్యాఖ్య అనుచితమని, మహిళా సాధికారతకు విరుద్ధమని అభిప్రాయపడుతున్నారు. మరికొంతమంది ఆమెను సమర్థిస్తూ, ఆమె తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తపరచే హక్కును ఉపయోగించుకున్నారని వాదిస్తున్నారు.