/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Kamareddy_-A-man-was-brutally-murdered-in-Sirpur.-The-reason-was-extramarital-affair-jpg.webp)
Waranagal: తెలంగాణలో మరో యువతి దారుణ హత్యకు గురైంది. వరంగల్ జిల్లా కాజీపేట శివారు ప్రాంతంలోని అమ్మవారిపేట సాయినాథ్ రియల్ ఎస్టేట్ వెంచర్ దగ్గర 30 ఏళ్ల వయసున్న అమ్మాయిని గుర్తు తెలియని దుండగులు చంపేశారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. యువతి మొహంపై బండరాళ్లతో దాడి చేసి హతమార్చినట్లు గుర్తించారు. ఈ మర్డర్ పై కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.