తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా మహలక్ష్మీ పథకం కింద మహిళలకు ఉచిత బస్ సౌకర్యాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 9న ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డితో సహా ఇతర మంత్రులు ప్రారంభించారు. ఆ రోజున మధ్యాహ్నం నుంచి మహిళలకు జీరో టికెట్లు జారీ చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అయితే నిజామాబాద్ జిల్లాలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ నుంచి బోధన్ వెళ్తున్న ఆర్టీసీ బస్లో ఓ కండక్టర్ మహిళా ప్రయాణికురాలికి టికెట్ కొట్టడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా స్పందించారు. ఆ కండక్టర్పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే ఈ ఘటనపై అసలు విషయం బయటపడింది.
పూర్తిగా చదవండి..TSRTC: మహిళకు టికెట్ కొట్టిన కండక్టర్ ఘటన.. అసలు నిజం ఇదే..
నిజామాబాద్ నుంచి బోధన్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ మహిళకు కండక్టర్ టికెట్ కొట్టడం చర్చనీయమైంది. అయితే ఆ ప్రయాణికుడు ముందుగా మూడు టికెట్లు ఇవ్వమనడంతో కండక్టర్ అలాగే ఇచ్చారు. కానీ వారిలో ఓ మహిళ ఉండటంతో టికెట్ చెప్పడం వల్ల కండక్టర్ ప్రయాణికుడి మధ్య వాగ్వాదం జరిగింది.
Translate this News: