Madhya Pradesh: కుటుంబంలోని 8 మందిని గొడ్డలితో నరికి చంపిన అదే కుటుంబానికి చెందిన వ్యక్తి!

మధ్యప్రదేశ్​లో ఓ వ్యక్తి తన కుటుంబంలోని 8మందిని గొడ్డలితో నరికి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది.వారిన చంపిన కొద్ది సమయానికే అతను కూడా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. హత్యకు పాల్పడిన అతనికీ కొద్ది రోజుల క్రితేమే వివాహం జరగటం గమనార్హం.

New Update
Madhya Pradesh: కుటుంబంలోని 8 మందిని గొడ్డలితో నరికి చంపిన అదే కుటుంబానికి చెందిన వ్యక్తి!

Man Kills 8 Family Members: మధ్యప్రదేశ్​ ఛింద్వారా జిల్లాలోని ఓ గ్రామంలో మంగళవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబంలోని  అందరు నిద్రిస్తున్న సమయంలో.. నిందితుడు వారిపై కిరతకంగా గొడ్డలి తో దాడి చేశాడు. మొదట నిందితుడు 8 రోజుల క్రితం పెళ్లి చేసుకున్న తన  భార్యను నరికి చంపాడు.  అనంతరం.. బయటకు వచ్చి, కుటుంబంలోని మిగిలిన వారందరిపై దాడి చేసి చంపేశాడు. మృతుల్లో తల్లి, సోదరి, వదినలతో పాటు 5,4, ఏడాది వయస్సు ఉన్న చిన్నారులు ఉన్నారు. మెడపై గొడ్డలితో నరికి చంపాడు. అర్థరాత్రి కావడంతో, అందరు నిద్రలో ఉండటంతో, ఎవరు ప్రతిఘటించలేదు.

అనంతరం.. అక్కడి నుంచి దగ్గరలో ఉన్న తన బంధువు ఇంటికి వెళ్లి పడుకుని ఉన్న 10ఏళ్ల బాలుడిపై గొడ్డలితో దాడి చేసే క్రమంలో బాలుడు నిద్ర నుంచి  లేవడంతో తృటిలో ప్రమాదం తప్పగా బాలుడికి గాయలైయాయి.దీంతో బాలుడు  గట్టిగా అరిచాడు. మిగిలిన వాళ్లు నిద్రలేచి, అతని వద్దకు పరుగులు తీశారు. ఇంతలో.. ఈ 23ఏళ్ల నిందితుడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు.

Also Read: వీడేం ప్రియుడు రా దేవుడా.. నడిరోడ్డుపై ప్రియురాలిని నరికేసి..!

కాగా.. ఘటనస్థలానికి 150 మీటర్ల దూరంలో ఉన్న ఓ చెట్టుకు నిందితుడు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలంలో జరిగన హత్యలపై విచారణ చేపట్టారు.విచారణలో నిందితుడికి కొద్ది కాలంగా మానసిక పరిస్థితి బాాగోలేదని..అతనికి కుటుంబ సభ్యులు చికిత్స అందిస్తున్నారని అధికారులు తెలిపారు. కాగా అతని మానసిక స్థితి బాగుందని తెలిసి కుటుంబ సభ్యులు పెళ్లి చేశారని.కొద్ది రోజుల తర్వాత ఇలా జరిగిందని వారు వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు