Adarsh Residency Hostel : రాజస్థాన్ కోటాలోని (Rajasthan Kota) బాయ్స్ హాస్టల్ (Boys Hostel)లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున ఉదయం 6.15కు లక్ష్మణ్ విహార్లోని ఆదర్శ్ రెసిడెన్సీ హాస్టల్లో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 8 మంది తీవ్రంగా, 6 గురు స్పలంగా గాయపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సెఫ్టీ, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మహారావ్ భీమ్ సింగ్ (MBS) ఆసుపత్రిలో చేర్పించారు. మరో 14 మంది మంటల నుంచి తప్పించుకునేందుకు భవనం మొదటి అంతస్తు నుంచి దూకగా ఒకరి కాలు ఫ్రాక్చర్ అయినట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..Fire Accident : బాయ్స్ హాస్టల్ లో భారీ అగ్ని ప్రమాదం.. 8 మంది!
రాజస్థాన్ కోటాలోని ఓ బాయ్స్ హాస్టల్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 8 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడగా మరో 6గురికి స్వల్పంగా మంటలంటుకున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు.
Translate this News: