నల్గొండ వేదికగా మంగళవారం బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సభ.. ఓ కుటుంబంలో విషాదం నింపింది. సభకు వెళ్లి తిరుగు ప్రయాణంలో వస్తుండగా.. ఓ కారు పల్టీలు కొట్టి విధులు నిర్వహిస్తున్న పోలీసులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ హోంగార్డు మృతిచెందగా.. మరో హోంగార్డు గాయపడ్డాడు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కంటోన్మెంట్ ఎమ్మె్ల్యే లాస్య నందిత కూడా ప్రమాదం బారిన పడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ ఆటో ఢీకొనడంతో నందిత గాయపడ్డారు. అయితే తాను సురక్షితంగా బయటపడ్డట్లు ఎక్స్లో తెలిపింది.
పూర్తిగా చదవండి..Telangana: బీఆర్ఎస్ సభ అనంతరం విషాదం.. విధులు నిర్వహిస్తున్న హోంగార్డు మృతి
నల్గొండలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సభ పూర్తికాగా.. తిరుగుప్రయాణంలో ఓ కారు చర్లపల్లి వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ హోంగార్డు మృతి చెందగా.. మరో హోంగార్డు గాయపడ్డారు.
Translate this News: