రెచ్చిపోయిన మందుబాబు..అడిగిన బ్రాండ్ ఇవ్వలేదని వైన్ షాప్‎కు నిప్పు..!!

దీపావళి పండగపూట ఓ మందుబాబు రెచ్చిపోయాడు. తాను అడిగిన బ్రాండ్ ఇవ్వలేదని లిక్కర్ షాపుకే నిప్పంటించాడు. ఈ ఘటనలో దాదాపు రూ. 2లక్షల విలువైన మద్యం బుగ్గిపాలైంది. కంప్యూటర్, ప్రింటర్, స్కానర్, ఫ్రిజ్ అన్నీ కాలిబూడిదయ్యాయి. ఈ ఘటన ఏపీలోని విశాఖలో చోటుచేసుకుంది.

రెచ్చిపోయిన మందుబాబు..అడిగిన బ్రాండ్ ఇవ్వలేదని వైన్ షాప్‎కు నిప్పు..!!
New Update

దీపావళి పండగపూట ఏపీలోని విశాఖలో ఓ మందుబాబు రెచ్చిపోయాడు. తాను అడిగిన బ్రాండ్ ఇవ్వలేదని లిక్కర్ షాపుకే నిప్పంటించాడు. ఈ ఘటనలో దాదాపు రూ. 2లక్షల విలువైన మద్యం బుగ్గిపాలైంది. కంప్యూటర్, ప్రింటర్, స్కానర్, ఫ్రిజ్ అన్నీ కాలిబూడిదయ్యాయి. పూర్తివివరాళ్లోకి వెళ్తే...నగరంలోని కొమ్మాది సాయిరాం కాలనీకి చెందిన మధు అనే వ్యక్తి పీకలదాకా తాగాడు. అక్కడితో చాలదన్నట్లు దగ్గర్లోని వైన్ షాప్ కు వెళ్లాడు. ఓ బ్రాండ్ పేరు చెప్పాడు. ఆ షాపులో అందుబాటులో లేదని సిబ్బంది చెప్పారు. దీంతో కోపంతో ఊగిపోయాడు మధు.

ఇది కూడా చదవండి:  దీపావళి నాడు లక్ష్మీ పూజ తర్వాత ఈ మంత్రాలను జపిస్తే మీ అదృష్టమే మారిపోతుంది..!!

బాటిల్లో పెట్రోల్ తీసుకుని వచ్చి మద్యం షాపు పై పోసి నిప్పంటించాడు. అంతా చూస్తుండగానే క్షణాల్లో దుకాణం మొత్తం కాలిబూడిదయ్యింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 2లక్షల విలువైన మద్యం, కంప్యూటర్, ప్రింటర్, స్కానర్, ఫ్రిజ్ కాలి బూడిదయ్యాయి. లోపల ఉన్న సిబ్బంది పెట్రోల్ పోయగానే ప్రాణభయంతో బయటకు పరుగులు పెట్టారు. కాగా తోటి మందుబాబులు స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి:  దీపావళి రోజు రాత్రి ఇవి కనిపించాయో…మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించిందని అర్థం..!!

#deepavali #telugu-news-updates #fire-accident #crime-news #ap-news #liquor-shop
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe