Crime News: వామ్మో.. నువ్వేం కూతురువమ్మా.. తండ్రిని, తమ్ముడిని ముక్కలు ముక్కలుగా నరికీ..!

మధ్య ప్రదేశ్ - జబల్పూర్ లో తన ప్రేమకు అడ్డుపడుతున్నారని తండ్రిని, తమ్ముడిని అతి దారుణంగా చంపింది 15 ఏళ్ల బాలిక. వారి శరీరాలను ముక్కలు ముక్కలుగా నరికి వాటిని ఫ్రిజ్‌లో పెట్టింది. కాగా రెండు నెలల తర్వాత బాలిక హరిద్వార్‌లో పట్టుబడగా, ముకుల్‌ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు.

New Update
Crime News: వామ్మో.. నువ్వేం కూతురువమ్మా.. తండ్రిని, తమ్ముడిని ముక్కలు ముక్కలుగా నరికీ..!

Madhya Pradesh: తన ప్రేమకు అడ్డుపడుతున్నారన్న కోపంతో 15 ఏళ్ల బాలిక కన్న తండ్రిని, తమ్ముడిని అతి దారుణాంగా చంపింది. ఆ తరువాత వారి శరీరాలను ముక్కలు ముక్కలుగా నరికి వాటిని ఫ్రిజ్‌లో పెట్టింది. ఈ దారుణమైన ఘటన మధ్య ప్రదేశ్ - జబల్పూర్ లో చోటుచేసుకుంది.

Also Read: బాలకృష్ణకు దండం.. అంజలి ట్వీట్ వైరల్.. మీరు అలా చేసినందుకు..!

15 ఏళ్ల బాలిక స్థానికంగా నివ‌సిస్తున్న ముకుల్ సింగ్‌ (19) అనే యువకుడితో ప్రేమ‌లో పడింది. ఇంట్లో వారికి విష‌యం తెలిసి వారు మంద‌లించ‌డంతో వీరిద్ద‌రూ ఇంట్లో నుంచి పారిపోయారు. దాంతో బాలిక తండ్రి పోలీసుల‌కు ఫిర్యాదు చేయడంతో.. మైన‌ర్‌ను ఎత్తుకెళ్లినందుకు ప్రియుడు ముకుల్‌ను అరెస్ట్ చేసారు.

Also Read: ఈ అవకాశం నాకు మాత్రమే వచ్చింది.. AB వెంకటేశ్వర రావు ఎమోషనల్.. !

అయితే, త‌న ప్రియుడిని జైల్లో పెట్టించి.. తన ప్రేమకు అడ్డుపడుతున్నారన్న కోపంతో, ముకుల్ విడుదలైన అనంతరం వారు ఇద్దరూ ఇంటికి వెళ్లి.. తండ్రిని, సోదరుడిని దారుణంగా చంపారు. వారి శరీరాలను ముక్కలు ముక్కలుగా నరికి వాటిని ఫ్రిజ్‌లో పెట్టింది.  కాగా, రెండు నెలల తర్వాత బాలిక హరిద్వార్‌లో పట్టుబడగా, ముకుల్‌ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు.

Advertisment
తాజా కథనాలు