Soldiers Dead : లడఖ్‌లో ప్రమాదం.. ఐదుగురు ఆర్మీ జవాన్లు మృతి

లడఖ్‌లో ఇండియన్ ఆర్మీ యుద్ధ విన్యాసాల్లో అపశ్రుతి జరిగింది. లేహ్‌కు 148 కిలోమీటర్ల దూరంలో ఉన్న మందిర్ మోర్ సమీపంలో టి 72 యుద్ధ ట్యాంకర్ నదిని దాటుతుండగా ఒక్కసారిగా నది ప్రవాహం పెరగడంతో ట్యాంకర్‌లో ఉన్న ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

Soldiers Dead : లడఖ్‌లో ప్రమాదం.. ఐదుగురు ఆర్మీ జవాన్లు మృతి
New Update

Soldiers Dead : ఈరోజు తెల్లవారుజామున లడఖ్‌ (Ladakh) లోని నియోమా-చుషుల్ ప్రాంతంలోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఎసి) సమీపంలో టి -72 ట్యాంక్‌లో నదిని దాటుతుండగా నీటిమట్టం ఒక్కసారిగా పెరగడంతో ట్యాంక్ లో ఉన్న ఐదుగురు ఆర్మీ సైనికులు (Army Soldiers) చనిపోయినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. "లేహ్ కు 148 కిలోమీటర్ల దూరంలో ఉన్న మందిర్ మోర్ (Mandir More) సమీపంలో, ఉదయం 1 గంటలకు విన్యాసాలు చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఐదుగురు సైనికులతో ఉన్న T-72 ట్యాంక్ నదిని దాటుతుండగా ఆకస్మిక వరదల కారణంగా మునిగిపోయిందని తెలిపారు. ఘటన జరిగిన సమయంలో ట్యాంక్‌లో ఐదుగురు సైనికులు, ఒక జేసీఓ, నలుగురు జవాన్లు ఉన్నారు." అని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read : సీఎం మమతపై గవర్నర్ పరువు నష్టం దావా!

#mandir-more #army-soldiers #t72-tank #ladakh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి