YS Sharmila: జగనన్నకు షర్మిల మరో షాక్.. రాఖీ సందర్భంగా ఏమని ట్వీట్ చేశారంటే?

నాకు రక్షణగా నిలబడ్డ ప్రతీ అన్న, తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు అంటూ ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఈ రోజు ట్వీట్ చేశారు. అయితే.. అన్న జగన్ పేరును షర్మిల తన ట్వీట్ లో ప్రస్తావించకపోవడం చర్చనీయాంశమైంది.

New Update
YS Sharmila: జగనన్నకు షర్మిల మరో షాక్.. రాఖీ సందర్భంగా ఏమని ట్వీట్ చేశారంటే?

రాఖీ పౌర్ణమి సందర్భంగా వైఎస్ షర్మిల ఈ రోజు తన 'X' ఖాతాలో పోస్ట్ చేశారు. తనకు అండగా ఉన్న ప్రతీ అన్నకు, తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు చెబుతున్నానంటూ తెలిపారు. 'తన జీవితంలో, రాజకీయ ప్రస్థానంలో అడుగడుగునా అండగా ఉంటూ .. రక్త సంబంధం లేకపోయినా.. YSR అనే బంధంతో నాకు తోబుట్టువుల్లాగ నిలబడి,అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ రక్షణగా నిలబడ్డ ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు. వెలకట్టలేని బంధాలను, వదులుకోలేని అనుబంధాలను గుర్తు చేసే మధుర బంధమే రక్షాబంధనం.

దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని నా ప్రార్థన' అంటూ షర్మిల పోస్ట్ చేశారు. అయితే.. అన్నాచెల్లెళ్ల పండుగైన ఈ రాఖీ రోజు షర్మిల తన అన్న ప్రస్తావనను ఈ పోస్ట్ లో అస్సలు తీసుకురాలేదు. దీంతో వైఎస్ ఫ్యామిలీ అభిమానులు నిరాశకు గురయ్యారు. కొందరు అన్నకు రాఖీ కట్టండి అంటూ కామెంట్ చేయగా.. మరికొందరు అన్న జగన్ కు రాఖీ కట్టిన పాత ఫొటోను కామెంట్స్ లో పెడుతున్నారు.

Also Read : ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ ఎండీ సస్పెండ్

Advertisment
తాజా కథనాలు