YS Sharmila : పవన్ కళ్యాణ్ ను కలిసిన షర్మిల..!!

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిశారు. వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజా రెడ్డి వివాహానికి హాజరవ్వాలని కోరుతూ వివాహా ఆహ్వాన పత్రికను అందించారు.

YS Sharmila : పవన్ కళ్యాణ్ ను కలిసిన షర్మిల..!!
New Update

YS Sharmila :  ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...చాలా బిజీగా ఉన్నారు. అటు రాజకీయాలు..ఇటు వ్యక్తిగత కారణాలతో నిమిషం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిశారు. త్వరలో జరగనున్న తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి పవన్ కల్యాణ్ ను ఆమె ఆహ్వానించారు. కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను పవన్ కు అందించారు. ఈ సందర్భంగా పలు విషయాలపై పవన్, షర్మిల కాసేపు చర్చించుకున్నారు.

publive-image

ఇది కూడా చదవండి: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కేసీఆర్ వీడియో

publive-image

#pawan-kalyan #ys-sharmila
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe