YS Sharmila : కుమారుడి వివాహంపై షర్మిల కీలక ప్రకటన.. రేపు ఇడుపులపాయకు కుటుంబ సమేతంగా..!

Y.S షర్మిల కుమారుడు రాజా రెడ్డి వివాహ వేడుకలకు సంబంధించి తన ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. కుమారుడు రాజా రెడ్డికి, అట్లూరి ప్రియకు ఈ నెల 18 నిశ్చతార్థం.. ఫిబ్రవరి 17 న వివాహ వేడుక జరగనున్నట్లు తెలిపారు.

New Update
YS Sharmila : కుమారుడి వివాహంపై షర్మిల కీలక ప్రకటన.. రేపు ఇడుపులపాయకు కుటుంబ సమేతంగా..!

YS Sharmila : YSRTP అధ్యక్షురాలు Y.S షర్మిల(YS Sharmila) ఇంట్లో పెళ్లి సంబరాలు మొదలు కానున్నాయి. షర్మిల కుమారుడు రాజారెడ్డి(Raja Reddy), శ్రీనివాస్ అట్లూరి కుమార్తె ప్రియా అట్లూరి(Priya Atluri) తో వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా షర్మిల తల్లి విజయమ్మ రాజారెడ్డి ప్రేమించిన అమ్మాయి ప్రియకు స్వయంగా వెళ్లి చీర పెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక తాజాగా షర్మిల వీరిద్దరి పెళ్లి వేడుకలకు సంబంధించి తన ట్విట్టర్(X) వేదికగా అధికారిక ప్రకటన చేశారు.

"ముందుగా షర్మిల అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు(New Year Wishes) తెలియజేస్తూ తన కుమారుడి వివాహ ముహుర్తాన్ని అందరితో షేర్ చేసుకున్నారు. కుమారుడు రాజా రెడ్డికి, అట్లూరి ప్రియకు ఈ నెల 18 నిశ్చతార్థం.. ఫిబ్రవరి 17 న వివాహ ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిపారు. ఈ వివాహ వేడుక గురించి మీ అందరితో పంచుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు షర్మిల. రేపు జనవరి 2 న తమ కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌ సందర్శించి.. మొదటి శుభలేఖను వైఎస్ఆర్ ఘాట్‌ దగ్గర ఉంచి.. నాన్న గారి ఆశీస్సులు తీసుకుంటామని తెలిపారు." రాజారెడ్డి, ప్రియా వివాహం రాజస్థాన్ లోని జోధ్‌పూర్‌ ఉమేద్‌ ప్యాలెస్ లో నిర్వహించనున్నట్లు సమాచారం. డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో జరగబోయే వీరి పెళ్లి వేడుకలకు కుటుంబ సభ్యులు, సన్నిహితుల హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

Also Read: Y.S Sharmila Son Marriage : ‘అందులో నిజం లేదు..’ క్లారిటీ ఇచ్చిన చట్నీస్!

Advertisment
తాజా కథనాలు