AP: గాయపడిన వైసీపీ కార్యకర్తలను పరామర్శించిన జగన్.. పాలనపై దృష్టి పెట్టకుండా..

కూటమి ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టకుండా దాడులు చేస్తోందని మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని.. ఇంత జరుగుతుంటే సీఎం చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అధికార పార్టీ దాడులకు ప్రజలు భయపడిపోతున్నారన్నారు.

New Update
AP: గాయపడిన వైసీపీ కార్యకర్తలను పరామర్శించిన జగన్.. పాలనపై దృష్టి పెట్టకుండా..

YS Jagan: విజయవాడలోని సన్‌రైజ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్తల్ని మాజీ సీఎం జగన్‌ పరామర్శించారు. జగ్గయ్యపేట నియోజకవర్గం నవాబుపేట వైసీపీ నేత గింజుపల్లి శ్రీనివాసరావుపై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. దాడిలో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. శ్రీనివాస రావుతో పాటు మరో ఇద్దరు వ్యక్తులపైనా కూడా దాడి జరిగింది. వైసీపీ కార్యకర్తల్ని పరామర్శించిన జగన్ టీడీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also read: పాలన చేతకాని వాడికి ప్రతిపక్ష హోదా ఎందుకు? జగన్‌పై ఎమ్మెల్యే ఫైర్..!

కూటమి ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టకుండా దాడులు చేస్తుందని విమర్శలు గుప్పించారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని.. ఇంత జరుగుతుంటే సీఎం చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అధికార పార్టీ దాడులకు ప్రజలు భయపడిపోతున్నారన్నారు. హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని.. వైసీపీ కార్యకర్తలపై దాడులు పెరిగిపపోతున్నాయని మండిపడ్డారు.

Advertisment
తాజా కథనాలు