Jagan: ఇది పిరికిపందల చర్య.. దక్కన్ క్రానికల్‌పై దాడిని ఖండించిన జగన్!

ఏపీలో దక్కన్ క్రానికల్ కార్యాలయంపై జరిగిన దాడిని మాజీ సీఎం జగన్ ఖండించారు. ఇది పిరికిపందల దాడి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కొత్త పాలనలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజాస్వామ్యం నిరంతరం ఉల్లంఘించబడుతోందంటూ విమర్శలు గుప్పించారు.

New Update
Jagan: ఇది పిరికిపందల చర్య.. దక్కన్ క్రానికల్‌పై దాడిని ఖండించిన జగన్!

Deccan Chronicle: ఏపీ విశాఖపట్నంలోని దక్కన్ క్రానికల్ కార్యాలయంపై జరిగిన దాడిపై మాజీ సీఎం జగన్ స్పందించారు. ఈ పిరికిపందల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దేనిని గుడ్డిగా లాగకుండా నిష్పక్షపాతంగా నడుచుకునే మీడియాను అణిచివేసేందుకు ఇది మరో ప్రయత్నం. కొత్త పాలనలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజాస్వామ్యం నిరంతరం ఉల్లంఘించబడుతోంది. ఆంధ్రప్రదేశ్ సీఎం దీనికి బాధ్యత వహించాలి' అంటూ విమర్శలు గుప్పించారు.

Advertisment
తాజా కథనాలు