YS Jagan-Chandrababu : 30 ఏళ్ల నాటి పొలిటికల్ సీన్ రిపీట్.. జగన్ కోలుకోవడానికి కనీసం పదేళ్లు?

1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ చేతిలో దారుణంగా ఓటమి పాలైన కాంగ్రెస్ కు కేవలం 26 సీట్లు మాత్రమే దక్కాయి. ఆ ఓటమి నుంచి కోలుకుని అధికారం దక్కించుకోవడానికి కాంగ్రెస్ కు పదేళ్లు పట్టింది. ప్రస్తుతం వైసీపీ కూడా కేవలం 11 సీట్లకే పరిమితం కావడంతో నాటి పరిస్థితులపై చర్చ సాగుతోంది.

New Update
YS Jagan-Chandrababu : 30 ఏళ్ల నాటి పొలిటికల్ సీన్ రిపీట్.. జగన్ కోలుకోవడానికి కనీసం పదేళ్లు?

AP Elections 2024 : ఏపీ ఎన్నికలో వైసీపీ (YCP) దారుణ పరాజయాన్ని ముటగట్టుకుంది. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించిన ఈ పార్టీ ఈ సారి కేవలం 11 సీట్లకే పరిమితమైంది. వైసీపీ ఓటమి తప్పదని అనేక సర్వేలు చెప్పినా.. ఈ స్థాయిలో పడిపోతుందని ఎవరూ అంచనా వేయలేకపోయారు. దీంతో వైసీపీ మళ్లీ పూర్వవైభవం పొందుతుందా? ఈ దారుణ దెబ్బ నుంచి ఆ పార్టీ కోలుకోవడం ఇక కష్టమేనా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగునాట ఇలా ఎప్పుడైనా జరిగిందా? అధికార పార్టీ ఇంత దారుణ స్థాయికి పడిపోయిన సందర్భాలు ఉన్నాయా? అన్న వివరాల్లోకి వెళ్తే..
publive-image

1994లో జరిగిన ఏపీ ఎన్నికల్లోనూ నాటి అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party) కి ఇలాంటి దారుణ పరాజయమే దక్కింది. 294 స్థానాల్లో బరిలోకి దిగిన ఆ పార్టీకి కేవలం 26 సీట్లలో మాత్రమే విజయం సాధించింది. అంటే దాదాపు 9 శాతం సీట్లను గెలుచుకుంది. అంటే.. ఇప్పుడు రాష్ట్రం విడిపోవడంతో ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 175 అసెంబ్లీ సీట్లు మాత్రమే ఉన్నాయి. 294లో 26 సీట్లు అంటే.. 175కు లెక్కిస్తే దాదాపు 16 గెలిచినట్లు లెక్క.

ఇప్పుడు వైసీపీ దాదాపు 7 శాతం సీట్లను గెలుచుకుంది. అయితే.. 1994లో ఆ దారుణ పరాజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ తిరిగి కోలుకోవడానికి పదేళ్లు పట్టింది. 2004లో రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లిన ఆ పార్టీ అధికార పీఠం దక్కించుకుంది.
publive-image

అయితే.. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడే (Chandrababu Naidu) ముఖ్యమంత్రిగా ఉండడం గమనార్హం. ఎన్టీఆర్ పై ఎమ్మెల్యేల తిరుగుబాటు తర్వాత 1 సెప్టెంబర్ 1995న సీఎం పదవిని చేపట్టిన చంద్రబాబు.. 2004 ఏప్రిల్ వరకు ఆ పదవిలో కొనసాగారు. మధ్యలో 1999లో వచ్చిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విశ్వప్రయత్నాలు చేసినా విజయం అందుకోలేకపోయింది. రాజశేఖర్ రెడ్డి సారథ్యంలో ఎన్నికలకు వెళ్లిన ఆ పార్టీకి 91 సీట్లు దక్కాయి. 180 సీట్లలో విజయం సాధించిన టీడీపీ వరుసగా రెండో సారి అధికారం దక్కించుకుంది.
publive-image

1999 ఎన్నికల్లో పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన రాజశేఖర్ రెడ్డి సీఎల్పీ నేతగా ఎన్నికయ్యారు. ఐదేళ్లుగా ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం, పాదయాత్ర ద్వారా ఆయన కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చారు. ప్రస్తుతం రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhara Reddy) కుమారుడు ప్రతిపక్షంలో ఉండగా.. చంద్రబాబు నాయుడు సీఎం కానున్నారు. ఈ దారుణ పరాజయం నుంచి కోలుకుని వైసీపీ మళ్లీ ఐదేళ్లలో పూర్వవైభవం దక్కించుకుంటుందా? లేక గతంలో కాంగ్రెస్ పార్టీ మాదిరిగా వైసీపీ అధికారంలోకి రావడానికి పదేళ్లు పడుతుందా? లేక ఆ పార్టీ ఇంకా కోలుకోలేదా? అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
publive-image

Also Read : ఏపీ ప్రభుత్వ కార్యాలయాలపై ప్రభుత్వం నిఘా.. సిట్‌ ఆఫీసుకు సీల్‌..!

Advertisment
తాజా కథనాలు