యువకుడి ఆత్మహత్యాయత్నం.. పోలీసుల వేధింపులే కారణమా?

ప్రేమ వ్యవహారం ఓ యువకుని బలి తీసుకుంది. న్యాయం జరగాల్సిన పోలీస్ స్టేషన్ ముందే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దారుణానికి పోలీసులే కారణమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు.

యువకుడి ఆత్మహత్యాయత్నం.. పోలీసుల వేధింపులే కారణమా?
New Update

Youth committed suicide due to police harassment

నెల్లూరు జిల్లాలో ఇవ్వాల దారుణం జరిగింది. సైదాపురం మండలంలో ఓ వ్యక్తి పోలీసు స్టేషన్​లోనే ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన నెలకొంది. ఆకాశ్​ అనే వ్యక్తి పోలీసు స్టేషన్​లోనే పురుగుల మందు తాగాడు. అతని పరిస్థితి సీరియస్​గా ఉండడంతో గూడూరు ఆస్పత్రికి తరలించారు. అయితే.. దీనికి పోలీసుల వేధింపులే కారణమని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

యువకుడి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారంలో గత మూడు రోజులుగా పోలీస్ స్టేషన్‌లో యువకుడినిస్టేషన్‌లో విచారిస్తున్నారు. ఆకాష్ స్వస్థలం వద్ద రాపూరు మండలం అక్కమాంబాపురం. నెల్లూరులో ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతూ మూడు నెలల క్రితం మరో యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. యువతి కుటుంబ సభ్యులు దిశ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరికీ కౌన్సిలింగ్ నిర్వహించి వారి, వారి కుటుంబ సభ్యుల దగ్గరకు చేర్చారు.

అయితే యువతి తల్లిదండ్రులు మాత్రం యువతికి మరో వ్యక్తితో వివాహం జరిపించారు.గత మూడు రోజుల నుండి యువతి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు సైదాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు 3 రోజులుగా ఆకాష్‌ను విచారిస్తున్నారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడి కుటుంబ సభ్యులు మాత్రం తన కుమారుడిని పోలీసులు వేధించడం వల్లనే ఆత్మహత్యకు పాల్పడ్డానని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలి వారు డిమాండ్ చేస్తున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe