Vellampalli : బోండా ఉమా ఓ తాగుబోతు..మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే.. వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు..!

టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు ఓ తాగుబోతు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు విజయవాడ సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్. మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సుజనా చౌదరికి వెస్ట్ నియోజకవర్గం గురించి ఏం తెలుసని ప్రశ్నించారు.

Vellampalli : బోండా ఉమా ఓ తాగుబోతు..మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే.. వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు..!
New Update

YCP Candidate Vellampalli : విజయవాడ సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ RTV తో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. సెంట్రల్ నియోజకవర్గంలో అడుగడుగునా ప్రజలు నీరాజనం పలుకుతున్నారని చెప్పుకొచ్చారు. టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు ఓ తాగుబోతు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పిల్లలు ఆయన ప్రచారం చేసుకున్న తన ఓటమిని ఆపలేరన్నారు. తెలుగుదేశం వాళ్ళు మా గొప్పతనం అనే విధంగా జబ్బలు చరుచుకుంటున్నారని.. అయితే, మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.

Also Read: భూకంపం వస్తే ఇలా జాగ్రత్తగా ఉండండి..!



ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఈ క్రమంలోనే సుజనా చౌదరికి వెస్ట్ నియోజకవర్గం గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. GPS ఆన్ చేసుకుని కొండలెక్కుతాడా? అక్కడ ప్రజలు సమస్యలు తెలుసుకుంటాడా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలోనే ఎస్పీలను, ఐఏఎస్ అధికారులను బదిలీ అనేది ఈసీ నిర్ణయమని వివరించారు.

#vellampalli-srinivas #vijayawada
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe