YCP Chief Jagan: నేడు పులివెందులలో మాజీ సీఎం జగన్ పర్యటన

AP: కడప జిల్లా పర్యటనలో ఉన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. ఇవాళ పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. పార్టీ కార్యకర్తలతో, నేతలతో సమావేశం కానున్నారు. రేపు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు.

YCP Chief Jagan: నేడు పులివెందులలో మాజీ సీఎం జగన్ పర్యటన
New Update

YCP Chief Jagan: కడప జిల్లా పర్యటనలో ఉన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. ఇవాళ పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. ప్రజలు, పార్టీ శ్రేణులతో సమావేశం అవుతారు. ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో నిరాశగా ఉన్న పార్టీ శ్రేణుల్లో భరోసా నింపనున్నారు. రేపు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి వెళ్తారు. కాగా నిన్న కడప రిమ్స్ ఆసుపత్రిలో టీడీపీ నేతల దాడులలో గాయపడ్డ వైసీపీ నేత అజయ్ రెడ్డిని జగన్ పరామర్శించారు.

 చంద్రబాబు జగన్ హెచ్చరిక..

చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చెడు సంప్రదాయానికి తెర లేపారన్నారు జగన్. భయాందోళన వాతావరణం సృష్టించాలని చూస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఇలాంటి దాడులను ఆపాలని చంద్రబాబును హెచ్చరిస్తున్నానన్నారు. వ్యవస్థను గాడిలో పెట్టాలని.. మోసపురిత వాగ్దానాలు నమ్మి ప్రజలు ఓట్లశారని.. ఇచ్చిన హామీలు అమలు చేయాలని సూచించారు. శిశుపాలుడిలా చంద్రబాబు పాపాలు వేగంగా పండుతున్నాయన్నారు. ఇంతవరకు స్కూల్ బాగ్స్ అందించలేదని.. అతిసారాతో విద్యార్థులు ఆసుపత్రి పాలైతే పట్టించుకున్న పాపాన పోలేదని చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

#jagan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి