/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/jagan-odarpu.jpg)
YCP Chief Jagan: మాజీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ ఓదార్పు, పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ నేతలకు జగన్ క్లారిటీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. హామీల అమలుపై కొత్త ప్రభుత్వానికి ఏడాది టైం ఇస్తామని జగన్ అన్నారు. ఆలోపు హామీల అమలు చేయాలని చెప్పారు. ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీకి హనీమూన్ టైం నడుస్తోందని చురకలు అంటించారు. లేదంటే ప్రజల కోసం తానే వస్తానని అన్నారు. ఆరు నెలల తర్వాత ప్రతి కార్యకర్తను కలుస్తా అని చెప్పారు. మూడేళ్ల తర్వాత పాదయాత్ర చేయనున్నట్లు పార్టీ నేతలకు జగన్ చెప్పారు.