కాంగ్రెస్ 'ఆరు గ్యారెంటీలు' పచ్చి అబద్ధాలు: కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప

ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యడ్యూరప్ప అన్నారు. కర్ణాటకలో ఆ పార్టీ పాలనలో విఫలమైందని, తెలంగాణలో బీజేపీకి అవకాశమివ్వాలని కోరారు.

New Update
కాంగ్రెస్ 'ఆరు గ్యారెంటీలు' పచ్చి అబద్ధాలు: కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప

Telangana Elections 2023: తెలంగాణలో ఆరు గ్యారెంటీలంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోందని, కానీ ప్రజలు మోసపోవద్దని బీజేపీ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప అన్నారు. బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి బుధవారం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విఫలమైందన్నారు. అక్కడ ఐదు హామీలను అమలు చేయలేకపోయిందని, తెలంగాణ ప్రజలు ఆరు హామీలను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. కర్ణాటక ప్రజలను మోసం చేసిన సిద్ధరామయ్య ప్రభుత్వం దివాలా దిశగా నడుస్తోందని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడ బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తుందని చెప్పారు. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమని, డబుల్ ఇంజిన్ సర్కారుతో తెలంగాణ అభివృద్ధిలో ముందుకెళ్తుందని యడ్యూరప్ప అన్నారు.

ఇది కూడా చదవండి: దుబ్బాక కారుదా, కమలానిదా..! రెండోసారి గెలుపు కోసం శ్రమిస్తున్న రఘునందన్

Advertisment
తాజా కథనాలు