Crime: గేటు గొడవ.. పురుషుడి ఆ పార్ట్ కొరుక్కుతిన్న మహిళ!

ఓ ఇంటి గేటు గొడవ వ్యక్తి ప్రాణాలమీదకు తెచ్చిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. కొడుకు ఎగ్జామ్ ఉందనే తొందరలో గేటు వేయకుండా వెళ్లాడు రామ్. దీంతో రాఖీ అనే మహిళా రామ్ తో గొడవపడి చెవి కొరికి తినేసింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
Crime: గేటు గొడవ.. పురుషుడి ఆ పార్ట్ కొరుక్కుతిన్న మహిళ!

UP: ఓ ఇంటి గేటు గొడవ వ్యక్తి ప్రాణాలమీదకు తెచ్చింది. తొందరపాటులో గేటు క్లోజ్ చేకుండా వెళ్లాడనే కోపంతో అదే ఇంట్లో ఉంటున్న మహిళ అతనిపై దాడిచేసింది. అంతటితో ఆగకుండా విచక్షణ కొల్పోయిన ఆమె భర్తతో కలిసి చిత్రహింసలకు గురిచేసింది. చివరగా గొడవ పెద్దది కావడంతో అతని చెవి కోరికేసి తీనేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో చోటుచేసుకుంది.

తెగిపోయిన మాంసాన్నిమింగేసింది..
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగ్రాకు చెందిన రిక్షా పుల్లర్ రామ్‌వీర్ భ‌గేల్ అనే వ్యక్తి మార్చి 4న త‌న కొడుకును ప‌రీక్షకు తీసుకెళ్లేందుకు ఉద‌యం 6 గంట‌లకు ఇంట్లో నుంచి బ‌య‌ల్దేరాడు. అయితే ఆ తొందరపాటులో ఆ భ‌వ‌నం గేటు మూయ‌డం మ‌రిచిపోయాడు. అదే భ‌వనంలో ఉంటున్న రాఖీ అనే మ‌హిళ రామ్‌వీర్ ఇంటికి రాగానే అత‌నితో గొడ‌వ‌ప‌డింది. గేట్ ఎందుకు మూయ‌లేద‌ంటూ వాగ్వాదం పెట్టుకుంది. ఇరువురి మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జరగగా.. ఇందులోకి రాఖీ భర్త సంజీవ్ ఎంటర్ అయ్యాడు. ఇరువురి తొపులాటలో సంజీవ్.. రామ్‌వీర్‌ను బలంగా అదిమిపట్టుకోగా రాఖీ చెవిని కొరికేసింది. దీంతో కొంత భాగం తెగిపోయిన మాంసాన్ని ఆమె మింగేసింది.

ఇది కూడా చదవండి: Modi: నేను అలాంటి నాయకుడిని కాదు.. ప్రతిపక్షాలపై మోడీ సెటైర్లు!

ఇక ఈ ఘటనలో తీవ్ర ర‌క్తస్రావంతో బాధ‌ప‌డుతున్న రామ్ ను స్థానికులు ఆస్పత్రికి త‌ర‌లించారు. అనంత‌రం బాధిత వ్యక్తి పోలీసుల‌కు ఫిర్యాదు చేయగా దీనిపై కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు