పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు మణిపూర్(Manipur) వీడియోను సర్క్యులేట్ చేయడం చూస్తే ప్రాథమికంగా ఇది కుట్రేనని భావించవలసి వస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(amit shah) అన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున బెట్టేందుకే ఈ వీడియోను వైరల్ చేసినట్టు కనిపిస్తోందన్నారు. నిజానికి 2022లో మియన్మార్లో జరిగిన రెండు ఘటనలను కూడా మణిపూర్లో జరిగినట్టు రెండు వీడియోలను సోషల్ మీడియాలో పెట్టారని, పోలీసులు వీటికి సంబంధించి ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని ఆయన చెప్పారు. ఆ రాష్ట్రంలో ఉద్రిక్తలను రెచ్చగొట్టేందుకే వీటిని సర్క్యులేట్ చేశారన్నారు. మే 4న కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలో సంబంధిత వీడియోగ్రాఫర్ను పోలీసులు అరెస్టు చేశారని, అతని మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారని ఆయన తెలిపారు.
పూర్తిగా చదవండి..మణిపూర్ వీడియోపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు.. నగ్నంగా ఊరేగించిన ఘటనపై హోంమంత్రి ఏమన్నారంటే..?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మణిపూర్ వీడియోపై హోంమంత్రి అమిత్షా స్పందించారు. ఈ వీడియోను కుట్రపూరితంగానే రిలీజ్ చేశారన్నారు. దారుణమైన ఈ ఘటనకు సంబంధించిన ఆరు కేసులను సీబీఐకి నివేదించామని మరో కేసును కూడా ఆ సంస్థ అధికారులు చేబట్టనున్నారని తెలిపారు.
Translate this News: